Vitamin D: మీరు ఎక్కువ సమయం పనిలోనే గడుపుతున్నారా..? అయితే మీకు విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. దానిని ఎలా నివారించాలంటే..?

మానవ శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండడానికి విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అయిేత ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. అలాంటి విటమిన్లలో..

Vitamin D: మీరు ఎక్కువ సమయం పనిలోనే గడుపుతున్నారా..? అయితే మీకు విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. దానిని ఎలా నివారించాలంటే..?
Vitamin D
Follow us

|

Updated on: Dec 06, 2022 | 7:48 PM

మానవ శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండడానికి విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. అలాంటి విటమిన్లలో విటమిన్ డీ కూడా ఒకటి. విటమిన్ డీ లోపం ఎక్కువగా పని చేసేవారిలో కనిపిస్తుంది. విటమిన్ లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయం విటమిన్ డీ మీద చేసిన పరిశోధనల ప్రకారం.. షిఫ్టులలో పనిచేసేవారు, ముఖ్యంగా ఇంటి లోపల పనిచేసే వారిలో విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 77 శాతం మంది కార్మికులు,  72 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 80 శాతం మంది ఎక్కువ కాలం పని చేస్తున్నవారిలో విటమిన్ డీ లోపం బాగా ఉన్నట్లు తేలింది.

విటమిన్-డీ లోపం శీతోష్ణ దేశాలతో పాటు ఉష్టోగ్రతలు ఎక్కువగా దేశాల్లో కూడా కనిపిస్తుంది. నాడీ వ్యవస్థ, మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డీ శరీరంలో ఉండడం అత్యవసరం. విటమిన్ డీ లోపాన్ని నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు.. 

జస్ట్ డైట్ క్లినిక్ వ్యవస్థాపకురాలు, డైటీషియన్ జస్లీన్ కౌర్ ప్రకారం.. శ్రామిక వర్గానికి తగినంత ఆహారం లభించదు. అందువల్ల వారిలో విటమిన్ల లోపం ఎక్కువగా ఉంటుంది. వారి సమయాభావం వల్ల తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తినలేక విటమిన్ లోపానికి గురవుతారు. ఇంకా సమయానికి తినాలి కనుక బయటి ఆహారాన్ని తీసుకుంటారు. కానీ కౌర్ ప్రకారం మార్కెట్‌లో లభించే అన్ని రకాల అహార పదార్థాలు మానవ ఆరోగ్యానికి మంచివి కావు. కానీ చాలా మంది బయట లభించేవాటినే ఎక్కువగా తినడంతో విటమిన్ లోపానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి విటమిన్ కాప్సుల్స్, లేదా విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్లను అందించవచ్చు.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి లోపం  ఎందుకు  కాల్షియంను నిర్వహించాలి

విటమిన్ డీ లోపం ఉన్నవారికి శరీరంలో కీళ్ల నొప్పులు, దంతాల సమస్యలు ఉంటాయని జస్లీన్ కౌర్ చెప్పారు. విటమిన్-డీ కావాలంటే ఉదయపు సూర్యకాంతి అద్భుతమైన మార్గం. ఇది ఎముకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం, గింజలు, చేపలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా విటమిన్ డీని పొందవచ్చు. విటమిన్ డీ లోపం ఉన్నవారు కాల్షియం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..