Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: 30 ఏళ్లలోపు మధుమేహం వస్తే మరణ ప్రమాదం పెరుగుతుంది.. పరిశోధనలో కీలక విషయాలు

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులలో అనేక ఇతర వ్యాధుల ముప్పు పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. 30 ఏళ్లలోపు మధుమేహ బాధితులుగా మారిన వారిలో, సాధారణ వయస్సు కంటే 8 నుంచి 14 ఏళ్లలోపు మరణించే ప్రమాదం కనిపించింది. ఎందుకంటే మధుమేహం శరీరంలోని అనేక ఇతర..

Diabetes: 30 ఏళ్లలోపు మధుమేహం వస్తే మరణ ప్రమాదం పెరుగుతుంది.. పరిశోధనలో కీలక విషయాలు
Diabetes
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2023 | 7:01 AM

మధుమేహం అనేది శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధి. భారతదేశంలో ఈ వ్యాధి పరిధి ప్రతి సంవత్సరం పెరుగుతోంది. మధుమేహం గుండె జబ్బులను కలిగిస్తుంది అలాగే మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు, ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. 30 ఏళ్ల లోపు వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పుడు మధుమేహానికి సంబంధించి కొత్త పరిశోధన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అందులో 30 ఏళ్లలోపు మధుమేహం వస్తే, మరణ ప్రమాదం పెరుగుతుందని స్పష్టం అవుతోంది. ఈ వయస్సులో మధుమేహం ఉన్న వ్యక్తి జీవితకాలం 14 సంవత్సరాల వరకు తగ్గుతుంది.

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులలో అనేక ఇతర వ్యాధుల ముప్పు పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. 30 ఏళ్లలోపు మధుమేహ బాధితులుగా మారిన వారిలో, సాధారణ వయస్సు కంటే 8 నుంచి 14 ఏళ్లలోపు మరణించే ప్రమాదం కనిపించింది. ఎందుకంటే మధుమేహం శరీరంలోని అనేక ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చిన్న వయసులోనే మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోయింది. గతంలో వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ డయాబెటిస్‌ ఇప్పుడు యువతల్లో మొదలైపోయింది. ఒక్కసారి డయాబెటిస్‌ వచ్చిందంటే చాలు ఆహార నియమాలు పాటిస్తూ అదుపులో పెట్టుకోవడం తప్ప పూర్తిగా నయం చేలేము.

మధుమేహం వల్ల గుండె, కిడ్నీ, కాలేయ వ్యాధులు పెరుగుతాయి. మధుమేహం కారణంగా అవయవాలపై ప్రభావం చూపడం వల్ల శరీరంలో ఇతర వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. వీటి వల్ల మనిషి సగటు వయసు తగ్గిపోవచ్చు. ప్రస్తుతం 30 ఏళ్ల లోపు వారిలో మధుమేహం కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఐదేళ్లలో ఇలాంటి కేసులు పెరిగాయి.

మధుమేహం పెరగడానికి కారణం ఏమిటి?

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ మాట్లాడుతూ.. తప్పుడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి కారణంగా టైప్-2 మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి పెరగడానికి మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. ఇంతకుముందు 50 ఏళ్లు పైబడిన వారు మధుమేహంతో బాధపడేవారు. ఇప్పుడు 30 ఏళ్లలోపు వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి మహమ్మారిలా పెరుగుతోంది. ప్రజలు తమ జీవనశైలిని సమయానికి మార్చుకోకపోతే, మధుమేహం భారతదేశంలో కూడా పెద్ద సమస్యగా మారుతుంది.

మధుమేహం లక్షణాలు ఏమిటి?

చాలా ఆకలిగా అనిపిస్తుంది

తరచుగా మూత్ర విసర్జన

ఆకస్మిక బరువు నష్టం

క్షీణించిన కంటి చూపు

దురద చెర్మము

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి