పవన్ ‘వకీల్ సాబ్’.. మరో మూడు నెలలు పట్టనుందా..!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'వకీల్ సాబ్'. బాలీవుడ్లో పెద్ద విజయం సాధించిన 'పింక్' రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్లో పెద్ద విజయం సాధించిన ‘పింక్’ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మొదట మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే కరోనా రావడంతో ఈ మూవీ షూటింగ్కి బ్రేక్ పడింది. ఇక ఈ నెల నుంచి తెలంగాణలో షూటింగ్లకు అనుమతి లభించడంతో.. త్వరలోనే వకీల్ సాబ్ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ పూర్తయ్యే సరికి మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. మూవీకి సంబంధించిన షూటింగ్ 35 రోజులు ఉండగా.. మిగిలిన పనులన్నీ పూర్తయ్యే సరికి దాదాపుగా మూడు నెలలు పట్టనుందట. ఈ క్రమంలో ఈ సినిమాను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: వలస కూలీల కోసం ముందుకొచ్చిన షమీ.. నెటిజన్ల ప్రశంసలు..!