న్యూ షెడ్యూల్ ఫిక్స్ చేసిన ‘ఎఫ్ 3’ యూనిట్.. కరోనా సమయంలోనూ రిస్క్ చేస్తున్నారా ?

|

Apr 14, 2021 | 10:49 PM

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఇందులో తమన్నా మెహరీన్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇటీవలే ఎఫ్3 బృందంలో హీరోయిన్ అంజలి చేరింది.

న్యూ షెడ్యూల్ ఫిక్స్ చేసిన ఎఫ్ 3 యూనిట్.. కరోనా సమయంలోనూ రిస్క్ చేస్తున్నారా ?
F3 Movie
Follow us on

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఇందులో తమన్నా మెహరీన్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇటీవలే ఎఫ్3 బృందంలో హీరోయిన్ అంజలి చేరింది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఎఫ్3 మూవీ.. ఇక బ్రేక్ లేకుండా షూటింగ్ చేసే ఆలోచనలో ఉందట. ఇదివరకు వెంకటేష్ దృశ్యం-2 సినిమా కోసం బ్రేక్ తీసుకున్నాడట. తాజాగా ఎఫ్ 3 షెడ్యూల్లో పాల్గోననున్నాడ వెంకటేష్. అయితే దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో.. పలు సినిమా షూటింగ్స్ ఆగిపోతున్నాయి. అలాగే పలు చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో ఎఫ్ 3 సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమాను ఆగష్టు 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న దిల్ రాజు… తన తదుపరి సినిమాలను కూడా వీలైనంత తర్వగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఎఫ్ 3 సినిమా న్యూ షెడ్యూల్ మైసూర్ లో ఫిక్స్ చేసుకున్నారట. అక్కడ ఈ నెల 15 నుంచి చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోనే సినిమాను మాక్సిమం కంప్లీట్ చేయాలనీ అనుకుంటున్నారట.తాజాగా ఈ చిత్రబృందం మైసూర్ వెళ్ళనున్నట్లుగా సమాచారం.

Also Read: ఆ రోజునే నా విలసవంతమైన జీవితాన్ని త్యజించాను.. ఎందుకంటే ఆ రోజు నాకు ఎంతో ప్రత్యేకం.. బాబా రామ్ దేవ్..

Tamil New Year 2021: సంప్రదాయపు దుస్తుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కీర్తి సురేష్..

ఎన్టీఆర్ కోసం మహేష్ హీరోయిన్.. ప్లాన్ చేస్తోన్న చిరు డైరెక్టర్.. మరోసారి తెలుగులోకి ముంబై బ్యూటీ..

సాయిపల్లవి అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్.. రానా దగ్గుపాటి ‘విరాట పర్వం’ వాయిదా..