Toxic Pre Release Event : టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కిందపడిన భారీ సౌండ్ సెట్.. విద్యార్థులకు గాయలు..

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి చోటు చేసుకుంది. రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ సెట్ కిందపడింది. దీంతో ఇద్దరు విద్యార్థులకు కాళ్లు విరిగినట్లు సమాచారం. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Toxic Pre Release Event : టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కిందపడిన భారీ సౌండ్ సెట్.. విద్యార్థులకు గాయలు..
Toxic Pre Release Event

Edited By:

Updated on: Aug 25, 2026 | 5:41 PM

పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ దులపల్లి లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు, అభిమానులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే హీరో యష్ మాట్లాడుతుండగా కుప్పకూలిన భారీ సౌండ్ బాక్స్ సెట్ కిందపడింది. ఒక్కసారిగా కిందపడిన భారీ సౌండ్ సెట్ కిందపడడంతో విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. దీంత ఇద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఓ అమ్మాయి స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

ఈ ఘటనతో విద్యార్థులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, నిర్వాహకులు రంగంలోకి దిగి వారికి సర్దిచెప్పడంతో గందరగోళ వాతావరణం సర్దుమణిగింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం విద్యార్థులను సముదాయించాల్సి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరుకావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని టాక్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా.. ఇందులో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

 

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

Loading...
Unable to load recommendations.
Follow Us