తార‌క్ నెక్ట్స్..వెంకీ ఫ‌స్ట్..త్రివిక్ర‌మ్ రెడీ…!

| Edited By: Pardhasaradhi Peri

May 06, 2020 | 8:33 PM

టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్‌ నటించిన ‘వాసు’, ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసి..వాటి రేంజ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌. వెంకీ కామిక్ టైమింగ్ కి త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ లు తోడైతే ఆ మజానే వేరు. మాటల రచయిత నుంచి డైరెక్ట‌ర్ గా మారిన త్రివిక్రమ్..‌. రైటర్​గా ఎంత క్రేజ్‌ సంపాదించాడో దర్శకుడిగా అంతకు మించి స‌క్సెస్ అందుకున్నారు. దాంతో వీరిద్దరి కాంబినేషన్​లో […]

తార‌క్ నెక్ట్స్..వెంకీ ఫ‌స్ట్..త్రివిక్ర‌మ్ రెడీ...!
Follow us on

టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్‌ నటించిన ‘వాసు’, ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసి..వాటి రేంజ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌. వెంకీ కామిక్ టైమింగ్ కి త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ లు తోడైతే ఆ మజానే వేరు. మాటల రచయిత నుంచి డైరెక్ట‌ర్ గా మారిన త్రివిక్రమ్..‌. రైటర్​గా ఎంత క్రేజ్‌ సంపాదించాడో దర్శకుడిగా అంతకు మించి స‌క్సెస్ అందుకున్నారు. దాంతో వీరిద్దరి కాంబినేషన్​లో మూవీ ఎప్పుడు వస్తుందా? అని కొన్నేళ్ల నుంచి మూవీ ల‌వ‌ర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కల నెరవేరే అవకాశముందని తెలుస్తోంది.

‘అల వైకుంఠపురములో’ తర్వాత ఎన్టీఆర్​తో ఓ సినిమా ప్రకటించారు త్రివిక్రమ్‌. 2021 స‌మ్మ‌ర్ లో విడుదల చేయాలని భావించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ పూర్తయిన తర్వాత తారక్‌తో షూటింగ్ మొదలుపెట్టాలకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ‘ఆర్ఆర్‌ఆర్‌’ ఆగిపోయింది. అది ముగిసిన తర్వాత తారక్​‌తో అంటే చాలా టైమ్ పడుతుంది. ఈ లోపు మరో ఎంటర్‌టైనింగ్‌ కథతో, వెంకీ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నారు త్రివిక్రమ్. ఫుల్ ఎంట‌ర్టైన్ మెంట్ కథతో దీనిని తీసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పూర్తి కావొచ్చు.