
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆతర్వాత నిర్మాతగా మారారు. నటుడిగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు, కొన్ని కీలక పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్. ఆతర్వాత నిర్మాతగా మారి సినిమాలు చేసి మెప్పించారు. ఆంజనేయులు సినిమాతో నిర్మతగా మొదలు పెట్టి గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు బండ్ల గణేష్. ఈ సినిమా తర్వాత టెంపర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన బండ్ల ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కానున్నారు. ఇప్పటికే బీజీ బ్లాక్ బస్టర్ అనే బ్యానర్ ను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేయనున్నారు.
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. “2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు.. నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం. నా బతుకుకి కొత్త అర్థం, కొత్త దారి చూపించిన మహత్తర సమయం. భగవంతుడు స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలో అడుగుపెట్టి, నేను ఊహించనంత ప్రేమను, అండను, అద్భుతాలను ప్రసాదించిన సంవత్సరం ఇది”
ఇలాంటి దివ్యమైన రోజులు వెళ్ళిపోతున్నాయంటే.. ఎందుకో చెప్పలేని బాధ, మధురమైన వేదన కలుగుతోంది. భగవంతుని నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను.. 2025 లాగా ఆశ నింపే రోజులు, విశ్వాసాన్ని బలపరిచే సంఘటనలు, సంకల్పాన్ని దృఢం చేసే అనుభవాలు రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా నాకు, మన అందరికీ దక్కాలని. అందరి జీవితాల్లో వెలుగు నిండాలి, అందరి ప్రయాణాలు అర్థవంతంగా మారాలి. అదే నా హృదయపూర్వక సంకల్పం.” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు బండ్లగణేష్. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
**“2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోంది.
ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు…
నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం.
నా బతుకుకి కొత్త అర్థం, కొత్త దారి చూపించిన మహత్తర సమయం.భగవంతుడు స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలో అడుగుపెట్టి,
నేను ఊహించనంత ప్రేమను, అండను,…— BANDLA GANESH. (@ganeshbandla) December 31, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.