AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరిసిన ధృవతార, నేడు కేవలం ఒక జ్ఞాపకం. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ల సరసన నటించి, వందకు పైగా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటి అశ్విని జీవితం ఇంతటి విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..
Tollywood Actress Ashwini
Ravi Kiran
|

Updated on: May 02, 2026 | 8:24 AM

Share

సినిమా గ్లామర్ ప్రపంచం బయట నుంచి చూసేటప్పుడు చాలా రంగులమయంగా కనిపిస్తుంది. కానీ, ఆ రంగుల వెనుక ఎన్ని కన్నీళ్లు, ఎంతటి నిశ్శబ్దం దాగి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. మన చిన్నప్పుడు టీవీలోనో, వెండితెరపైనో చూసి మురిసిపోయిన ఎంతోమంది తారలు నిజజీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరే నటి అశ్విని. ‘చూపులు కలిసిన శుభవేళ’ అంటూ మనల్ని పలకరించిన ఆ కళ్ళు, చివరి రోజుల్లో సహాయం కోసం ఎదురుచూశాయంటే నమ్మడం కష్టం.

నెల్లూరులో పుట్టి పెరిగిన అశ్విని, అలనాటి మహానటి భానుమతి ‘భక్త ధ్రువ’ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. చదువు కోసం చిన్న బ్రేక్ తీసుకున్నా, అదృష్టం ఆమెను మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది. ఇంటర్ చదువుతున్న వయసులోనే హీరోయిన్ ఛాన్స్ రావడం, ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలకృష్ణ సరసన ‘భలే తమ్ముడు’, వెంకటేష్ మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’.. ఇలా వరుస పెట్టి పెద్ద సినిమాల్లో నటించారు. దాదాపు పదేళ్ల పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆమె హవా నడిచింది.

అశ్విని కెరీర్ గ్రాఫ్ ఎంత వేగంగా పెరిగిందో, ఆమె వ్యక్తిగత జీవితం అంతకంటే వేగంగా పతనమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను నట్టేట ముంచేశాడని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. భర్త మోసం చేయడంతో మానసికంగా కృంగిపోయిన అశ్విని, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల మదనపడ్డారు. ఆ మానసిక ఒత్తిడే ఆమెను శారీరకంగా బలహీనపరిచింది. ఒంటరిగా ఉన్నా, మనసు చంపుకోలేక కార్తీక్ అనే అబ్బాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఆమె కళ్ళలో నవ్వు మాయమై, ఒక రకమైన శూన్యం ఆవహించింది.

చాలామంది నటీమణుల్లాగే అశ్విని కూడా సంపాదించిన డబ్బును దాచుకోవడంలో విఫలమయ్యారు. అనారోగ్యం పాలయ్యాక అవకాశాలు తగ్గిపోయాయి. చెన్నైలో ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేసి అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చింది. 2012లో సీరియల్స్ ద్వారా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించినా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆమెను శ్వాస తీసుకోనివ్వలేదు. కేవలం 45 ఏళ్ల వయసులోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె పార్థివదేహాన్ని తన సొంత ఊరు నెల్లూరుకు తీసుకెళ్లడానికి కూడా కుటుంబం దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నటుడు, దర్శకుడు పార్థిబన్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Also Read: సినిమాల్లో అవకాశం ఇప్పించమని కోట ఇంటికి వెళ్తే.. ఆయన ఎలా మాట్లాడేవారంటే.!

Follow Us