Taapsee Pannu: బాలీవుడ్‏లో రాత్రి 10 గంటల తర్వాత జరిగేది అదే.. తాప్సీ సంచలన కామెంట్స్..

సినిమాలు గురించి మాట్లాడేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తుంది. కానీ తన పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ గురించి అంతగా అభిమానులతో పంచుకోదు. కానీ ఇండస్ట్రీలో జరిగే విషయాలపై తన గొంతు వినిపిస్తుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీలలో ఎక్కువగా కనిపించదు. జామ్‌నగర్‌లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు కూడా ఆమె హాజరు కాలేదు. బర్త్ డే పార్టీలు ఉంటే వాటికి దూరంగా ఉంటారు. ఎందుకు అనే ప్రశ్నకు ఆమె తాజాగా సమాధానమిచ్చారు.

Taapsee Pannu: బాలీవుడ్‏లో రాత్రి 10 గంటల తర్వాత జరిగేది అదే.. తాప్సీ సంచలన కామెంట్స్..
Taapsee Pannu

Updated on: Mar 12, 2024 | 2:28 PM

ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది తాప్సీ పన్ను. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. చాలాకాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. తాప్సీ ఇప్పుడున్న హీరోయిన్స్ అందరిలో చాలా ప్రత్యేకం. ఏదైనా సమస్య గురించి నేరుగా మాట్లాడుతుంది. సినిమాలు గురించి మాట్లాడేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తుంది. కానీ తన పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ గురించి అంతగా అభిమానులతో పంచుకోదు. కానీ ఇండస్ట్రీలో జరిగే విషయాలపై తన గొంతు వినిపిస్తుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీలలో ఎక్కువగా కనిపించదు. జామ్‌నగర్‌లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు కూడా ఆమె హాజరు కాలేదు. బర్త్ డే పార్టీలు ఉంటే వాటికి దూరంగా ఉంటారు. ఎందుకు అనే ప్రశ్నకు ఆమె తాజాగా సమాధానమిచ్చారు.

తాప్సీ మాట్లాడుతూ. “పెద్ద స్టార్స్‌కి మెసేజ్‌లు పంపమని కొందరు చెప్పారు. అలా అయితే వారు నన్ను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారు. నేను అలా చేయలేదు. నేను పొద్దున్నే నిద్ర లేస్తాను కాబట్టి త్వరగా పడుకోవాలి. నేను సిగరెట్ తగను. కాబట్టి పార్టీల్లో ఏం చేయాలో నాకు తెలియడం లేదు’ అని అన్నారు. నాకు అంతగా పరిచయం లేని వ్యక్తులతో నేను పార్టీలు చేసుకోలేను. నేను వారితో ఏమి మాట్లాడాలి ? పార్టీ పెట్టకపోతే ఏ పనీ రాదని అర్థం కాదు. ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్‌లో ఈజీగా ముందుకెళ్లొచ్చు. అయితే, 10 గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది. నేను కష్టపడి పనిచేస్తాను. ఇప్పటివరకు అంతే కష్టపడి ముందుకు వచ్చాను. ” అంటూ చెప్పుకొచ్చింది.

తాప్సీ పన్నూ.. గత పదేళ్లుగా మథాయుస్ బో తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెలలో వీరిద్దరి వివాహం జరగనుందనే ప్రచారం నడించింది. అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది తాప్సీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us