Uppena Movie: బాలీవుడ్‏లోకి ‘ఉప్పెన’.. రీమేక్‏లో హీరోయిన్‏గా ఆ బ్యూటీ చెల్లెలు.. హీరో ఎవరంటే..

|

Mar 22, 2024 | 4:28 PM

ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతిసాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు.. ఇప్పుడు సెకండ్ సినిమా నేరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు.

Uppena Movie: బాలీవుడ్‏లోకి ఉప్పెన..  రీమేక్‏లో హీరోయిన్‏గా ఆ బ్యూటీ చెల్లెలు.. హీరో ఎవరంటే..
Uppena Movie
Follow us on

డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్.. హీరోయిన్ కృతి శెట్టి వెండితెరకు పరిచయమయ్యారు. విడుదలకు ముందే మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. ఆ తర్వాత సెన్సెషన్ అయ్యింది. ఇక ఇందులో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి నటనకు అడియన్స్ అంతా ఫిదా అయ్యారు. హీరోయిన్ తండ్రి పాత్రలో మక్కల్ సెల్వన్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతిసాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు.. ఇప్పుడు సెకండ్ సినిమా నేరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు.

అసలు విషయానికి వస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటించనుంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రొడ్యూసర్.. జాన్వీ కపూర్ ఫాదర్ బోనీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమాను చూశానని.. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే తన చిన్న కూతురు ఖుషీ కపూర్ ను కూడా ఉప్పెన చూడమని చెప్పానని అన్నారు. దీంతో త్వరలోనే బాలీవుడ్ లో ఉప్పెన సినిమాను రీమేక్ చేయనున్నారని..అందులో హీరోయిన్ గా ఖుషీ కపూర్ కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. అయితే హీరోగా ఎవరు నటించనున్నారనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

ఇప్పటికే ఖుషీ కపూర్ ఓటీటీలో ఆర్చీస్ అనే సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కథానాయికగా వెండితెరపై సందడి చేసేందుకు అడుగులు వేస్తుంది ఖుషీ. ఇప్పటికే ఆమె రెండు క్రేజీ ఆఫర్స్ అందుకుందని.. సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహిం మూవీలో ఖుషీ కనిపించనుందని తెలుస్తోంది. అలాగే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ చిత్రంలోనూ ఈ బ్యూటీ నటించనుందట. మరోవైపు ఆమె సోదరి జాన్వీ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా గడుపుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.