రెండేళ్ల వెడ్డింగ్ యానివర్సరీ… చైతుతో నా బంధం.. స్వీటీ మధురానుభూతుల అనుబంధం !

|

Oct 07, 2019 | 11:01 AM

మా బంధం ఏయేటికా ఏడు బలపడుతోంది. రెండేళ్ల యానివర్సరీ.. పదేళ్ల ‘ కథ ‘ కి ప్రతిబింబం.. చైతూ ! నీ వెంటే నేనూ.. అంటూ అందాల నటి సమంత తన ఇన్స్టా గ్రామ్ లో పేర్కొంది. సమంత, నాగ చైతన్యల వివాహబంధానికి నిన్నటితో రెండేళ్లు పూర్తి అయ్యాయి. 2017 అక్టోబరు 6 న వీరి మ్యారేజ్ గోవాలో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. నాటి తమ పెళ్లి తాలూకు ఫోటోలను, వీడియోలను ఆమె పోస్ట్ […]

రెండేళ్ల వెడ్డింగ్ యానివర్సరీ... చైతుతో నా బంధం.. స్వీటీ మధురానుభూతుల అనుబంధం !
Follow us on

మా బంధం ఏయేటికా ఏడు బలపడుతోంది. రెండేళ్ల యానివర్సరీ.. పదేళ్ల ‘ కథ ‘ కి ప్రతిబింబం.. చైతూ ! నీ వెంటే నేనూ.. అంటూ అందాల నటి సమంత తన ఇన్స్టా గ్రామ్ లో పేర్కొంది. సమంత, నాగ చైతన్యల వివాహబంధానికి నిన్నటితో రెండేళ్లు పూర్తి అయ్యాయి. 2017 అక్టోబరు 6 న వీరి మ్యారేజ్ గోవాలో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. నాటి తమ పెళ్లి తాలూకు ఫోటోలను, వీడియోలను ఆమె పోస్ట్ చేస్తూ..ఆ మధురానుభూతులను ఒక్కసారిగా గుర్తు చేసుకుంది. ‘ మా బంధం పటిష్టపడుతోంది. ఇది పదేళ్ల కథ కి అద్దం పడుతోంది ‘ అంటూ హృదయం లోతులనుంచి కామెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దంపతులకు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, లావణ్య త్రిపాఠీ, త్రిష కృష్ణన్, హన్సిక మోత్వానీ వంటి హీరోయిన్లు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇక ప్రస్తుతం ముంబైలో ఉన్న రానా దగ్గుబాటి ప్రత్యేకంగా ఈ కపుల్ ని గ్రీట్ చేశాడు. మీరు కలకాలం ఆనందంగా ఉండాలి.. మీ దంపతులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీటించాడు. ‘ ‘ ఏ మాయ చేశావె “, ” ఆటోనగర్ సూర్య “, ” మనం ” వంటి చిత్రాల్లో ఈ కపుల్ కలిసి నటించారు.