టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత గత కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యశోద చిత్రానికి ఇంట్లోనే ఉండి ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. అలాగే త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న శాకుంతలం సినిమాకు కూడా డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది సామ్. అయితే కొంత కాలంగా నెట్టింట సైలెంట్ గా ఉన్న సమంత ఆకస్మాత్తుగా ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యేక్షమైంది. ఆమె తెల్లటి స్లీవ్ లెస్ షర్ట్.. ప్యాంట్ ధరించి సన్ గ్లాసెస్తో నడుస్తూ వెళ్తుంది. లేటేస్ట్ వీడియో చూస్తేంటే సామ్ పూర్తిగా మారిపోయి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఇక ప్రస్తుతం సామ్… డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మయోసైటిస్ సమస్యతో ఇబ్బందిపడుతున్న సామ్.. ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇటీవలే ఆమె మేనేజర్ సామ్ హెల్త్ అప్డేట్ ఇస్తూ.. త్వరలోనే ఆమె తిరిగి చిత్రీకరణలో పాల్గొననుందని.. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సిల్ చేయలేదని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇండియన్ సినీ ప్రేక్షకులు 2023లో చూడాలనుకుని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న విజువల్ వండర్గా శాకుంతలం తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది.ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమగాథనున భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.