
చాలా మంది స్టార్ హీరోయిన్స్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. యాక్షన్ సీన్స్, ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్ లో హీరోలతో పోటీపడుతూ ఎంతో మంది అందాల భామలు అదరగొడుతున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. హీరోలకు మించి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగని ఆమె ఫైట్స్, స్కిన్ షో , స్పెషల్ సాంగ్స్ గట్రా చేయదు. కేవలం తన నటనతోనే కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు , తమిళ్, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ నటిస్తూ యమా బిజీగా ఉన్న ఆ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆమె ఒకానొక టైంలో ఒక్క రోజు సెలవు కోసం ఏడ్చేసిన సందర్భం కూడా ఉందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సాయి పల్లవి. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి నటనకు ఫిదా అవ్వని కుర్రాడు ఉండడు. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది సాయి పల్లవి.
బాలీవుడ్ లో రామాయణం సినిమాతో పాటు మరో సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. “మాములుగా అయితే నేను ఒకేసారి ఒక సినిమా మాత్రమే చేస్తాను. కానీ, కోవిడ్ తర్వాత అనుకోకుండా ఒకేసారి మూడు సినిమాలు చేయాల్సి వస్తుంది. ఒకే సారి మూడు సినిమాలు చేయడంతో నాకు షూటింగ్స్ కు గ్యాప్ దొరకడం లేదు. నిజానికి కంటిన్యూగా పనిచేయడం నాకు అలవాటు లేదు. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఒక్క రోజు కూడా సెలవు దొరకడం లేదని ఏడ్చేశా కూడా.. కానీ ఆ విషయం గురించి ఏ నిర్మాతకు, దర్శకుడికి గానీ చెప్పలేదు. ఎందుకంటే నా వల్ల ఏ సినిమాకు ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.