Rashmika Mandanna: ‘బేబీ’ ప్రీమియర్ షో చూసి రష్మిక ఎమోషనల్.. వీడియో వైరల్..

|

Jul 14, 2023 | 2:50 PM

కాగా గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో బేబీ సినిమా ప్రీమియర్ షో జరిగింది. విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, మారుతితోపాటు, పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా ప్రీమియర్ షోకు విచ్చేసి సందడి చేశారు. ఈ సినిమా ప్రతి అడియన్స్ మనసులను కదిలిస్తోందని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే బేబీ చిత్రాన్ని చూసి రష్మిక భావోద్వేగానికి గురయ్యారు.

Rashmika Mandanna: బేబీ ప్రీమియర్ షో చూసి రష్మిక ఎమోషనల్.. వీడియో వైరల్..
Rashmika, Baby Movie
Follow us on

ప్రస్తుతం థియేటర్లలో బేబీ సందడి మొదలైంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్‏ఫుల్ లవ్ ఎంటర్టైనర్‏కు ఉదయం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులో కథానాయికగా వైష్ణవి చైతన్య నటించగా.. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో కనిపించారు. కాగా గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో బేబీ సినిమా ప్రీమియర్ షో జరిగింది. విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, మారుతితోపాటు, పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా ప్రీమియర్ షోకు విచ్చేసి సందడి చేశారు. ఈ సినిమా ప్రతి అడియన్స్ మనసులను కదిలిస్తోందని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే బేబీ చిత్రాన్ని చూసి రష్మిక భావోద్వేగానికి గురయ్యారు. సినిమా పూర్తయ్యాక థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. కాస్త ఎమోషన‏ల్‏గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అలాగే ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ సైతం ఎమోషనల్ అయ్యింది. సాయి రాజేశ్, ఎస్కేఎన్ లను చూస్తే తనకేంతో గర్వంగా ఉందన్నారు విజయ్ దేవరకొండ. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ఏడిపించేశారని అన్నారు విజయ్. ఒక అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించారని.. వైష్ణవి తన నటనతో ఏడిపించేసిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక హీరోయిన్ రాశీ ఖాన్నా సైతం బేబీ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. మూవీ అద్భుతంగా ఉందని.. తన స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయని చెప్పుకొచ్చింది. తనను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు సాయి రాజేశ్, ఎస్కేఎన్ బ్రదర్స్ కు థాంక్స్ అంటూ ఆనంద్ దేవరకొండ భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు ఆనంద్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.