నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెడతావ్: ప్రకాశ్ రాజ్‌పై బండ్ల ఘాటు వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో మరోసారి సోషల్ మీడియా వార్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్రపై ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన సెటైరికల్ పోస్టుకు బండ్ల గణేశ్ ఘాటుగా స్పందించారు. "ప్రతిదాంట్లో వేలు ఎందుకు పెడతావ్?" అంటూ ప్రశ్నించిన బండ్ల, ప్రకాశ్ రాజ్‌పై వరుస విమర్శలు గుప్పించారు.

నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెడతావ్: ప్రకాశ్ రాజ్‌పై బండ్ల ఘాటు వ్యాఖ్యలు
Prakash Raj Vs Bandla Gane

Updated on: Jun 04, 2026 | 11:32 AM

టాలీవుడ్‌లో కొత్త రచ్చ మొదలైంది. ప్రకాశ్ రాజ్, బండ్ల గణేశ్ మధ్య సోషల్‌మీడియా వార్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ ప్రకాష్‌రాజ్‌ సెటైర్లు వేస్తే.. దానికి వెంటనే బండ్ల గణేశ్ కౌంటర్లు ఇచ్చారు..!

తెలంగాణలో పోటీపై పవన్‌ను ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్‌ Xలో పోస్ట్‌ పెట్టారు. మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర అంటూ కామెంట్‌ చేశారు. ఉత్తుత్తినే వస్తున్నారా.. పొత్తుతో వస్తున్నారా.. లేదంటే.. సింగిల్‌గా వస్తున్నారా చెప్పండి జస్ట్ ఆస్కింగ్‌ అంటూ ప్రకాశ్ రాజ్‌ టార్గెట్ చేశారు.

సెటైరికల్‌గా ప్రకాశ్ రాజ్‌ చేసిన ట్వీట్‌కి వెంటనే బండ్ల గణేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రతిదాంట్లో వేలు ఎందుకు పెడతావ్ అంటూ ప్రకాష్‌రాజ్‌ని ప్రశ్నించారు బండ్ల. అసలు నువ్వెవరు.. నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడవాడివా అంటూ చెలరేగిపోయారు. నీ ఊరేది, నీ కథ ఏంటి, ప్రతి దాంట్లో దూరి జడ్జిమెంట్‌ ఇవ్వడానికి నువ్వేమైనా దేశ ప్రధానివా అంటూ ప్రశ్నించారు. పనిలేకపోతే పని చూసుకోవాలని, ప్రతిదాంట్లో దూరి హీరోలా ఫీల్‌ అవ్వొద్దని వార్నింగ్‌ ఇచ్చారు.

తరచూ వివాదాల్లో ఉండడం ప్రకాశ్ రాజ్‌కి అలవాటే. BJP విషయంలోనూ, సనాతన ధర్మం, హైందవ, ధార్మిక అంశాల్లోనూ ఆయన ఎక్స్‌ వేదికగా ఘాటైన పోస్టులు పెడుతుంటారు. ప్రెస్‌మీట్లలోనూ నిలదీస్తూ ఉంటారు. ఇప్పుడు BJPకి మిత్రుడైన పవన్ కల్యాణ్‌ విషయంలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పవన్ కల్యాణ్‌ హైదరాబాద్‌లో సభ పెట్టాలనుకున్నారు. అందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పవన్ ఆవేశంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పారు. దీన్నే ఇప్పుడు ప్రకాశ్ రాజ్‌ టార్గెట్‌ చేశారు.

 

Follow Us