Dasari Sahithi: ఎన్నికల బరిలో పొలిమేర నటి.. నామినేషన్ దాఖలు చేసిన సాహితి..

|

Apr 25, 2024 | 10:21 AM

ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు పోటీపడుతుండగా.. మరికొందరు నాయకుల తరుపున ప్రచారం చేస్తున్నా్రు. ఇప్పుడు ఎన్నికల బరిలోకి మరో టాలీవుడ్ నటి దిగింది. సూపర్ హిట్ సిరీస్ పొలిమేర చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది సాహితి దాసరి. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సాహితి పొలిమేర 1, పొలిమేర 2 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో కనిపించింది.

Dasari Sahithi: ఎన్నికల బరిలో పొలిమేర నటి.. నామినేషన్ దాఖలు చేసిన సాహితి..
Sahithi Dasari
Follow us on

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారాలతో ఎన్నికల పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే రాజకీయ బరిలో నిలిచిన నాయకులు నామినేషన్స్ దాఖలు చేశారు. మరోవైపు దేశవ్యా్ప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలలో ఈసారి సినీతారల తాకిడి ఎక్కువగా ఉంది. ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు పోటీపడుతుండగా.. మరికొందరు నాయకుల తరుపున ప్రచారం చేస్తున్నా్రు. ఇప్పుడు ఎన్నికల బరిలోకి మరో టాలీవుడ్ నటి దిగింది. సూపర్ హిట్ సిరీస్ పొలిమేర చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది సాహితి దాసరి. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సాహితి పొలిమేర 1, పొలిమేర 2 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో కనిపించింది.

ఇక పొలిమేర 2 సినిమాలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయిగా కనిపించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో పలు కీలకపాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాహితి.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏప్రిల్ 24న నామినేషన్ దాఖలు చేసింది. సాహితి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని.. ఇన్ స్టాలో తాను రీల్స్ చేసే పాటలకు పొలిటికల్ విషయాలను ఆపాదించొద్దని ఇన్ స్టా వేదికగా కోరారు.

చేవేళ్లలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీలో ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. ఈ క్రమంలోనే రిటర్నంగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్ కు సాహితి నామినేషన్ సమర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.