Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్ .. సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
వినోదయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్నారు పవన్. ఈ సినిమాకు నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వచింది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. మొగలాయిల కాలం నటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. అలాగే ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వినోదయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్నారు పవన్. ఈ సినిమాకు నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పార్ట్ ను పూర్తి చేసేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఒరిజినల్ లో సముద్రఖని చేసిన పాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాలో చాలా మార్పులు చేశారని తెలుస్తోంది.
కథలో మార్పులతో పాటు పవన్ కళ్యాణ్ పాత్రను కూడా పెంచారట. అలాగే క్లైమాక్స్ లో కూడా మార్పులు చేశారట. ఈ మూవీని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 28న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.