
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా కోసం అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలోని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కు ముందే సందడి చేస్తున్నారు. OG ఫీవర్ ఉత్తర అమెరికాను తాకింది.. విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టిక్కెట్ల అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ప్రీమియర్కు ఇంకా సమయం ఉంది. స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్యాన్స్ ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటోంది.
యాక్షన్-ప్యాక్డ్ గ్యాంగ్స్టర్ డ్రామా తెరకెక్కిన OG విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తెలుగులో ఓమి భావు అనే విలన్గా అరంగేట్రం చేస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ , శ్రీయా రెడ్డి , హరీష్ ఉత్తమన్ ఇతర ప్రధాన తారాగణం. తమన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 45,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక అద్భుతమైన ఘనత. ఉత్తర అమెరికాలోనే ఈ ప్రీమియర్ ప్రీ సెల్ ద్వారా $1 మిలియన్ గ్రాస్ మార్కును దాటింది. ఇది కళ్యాణ్ స్టార్ పవర్ను రుజువు చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..