Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరి పాట రాశారు. ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో నాని రెండు విభిన్న మైన పాత్రల్లో కనిపించనున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ప్రియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్. ఈ సినిమాలో నాని , సాయి పల్లవి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్రయూనిట్ చెప్తుంది. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఇలా ప్రొడక్ట్ మొత్తం పూర్తయిన తరువాత చూసుకుంటే మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. సినిమా పట్లా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అని నాని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి పాల్గొన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :