Tollywood: ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న అందాల తార..

|

Nov 14, 2023 | 8:43 PM

తెలుగు ప్రేక్షకులకు పాత్ర, నటన నచ్చితే గుండెల్లో గుడి కట్టేస్తారు. తొలి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఒకటి, రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైనా..ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆ అందాల తార తెలుగులో చేసింది ఒక్క సినిమానే కానీ. ఇప్పటికీ సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టగలరా ?.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ నటన రంగంలోకి అడుగుపెడుతుంది.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న అందాల తార..
Actress
Follow us on

తెలుగు ప్రేక్షకులకు పాత్ర, నటన నచ్చితే గుండెల్లో గుడి కట్టేస్తారు. తొలి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఒకటి, రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైనా..ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆ అందాల తార తెలుగులో చేసింది ఒక్క సినిమానే కానీ. ఇప్పటికీ సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టగలరా ?.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ నటన రంగంలోకి అడుగుపెడుతుంది. తనే గిరిజా షెత్తర్. ఆమె పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ‘గీతాంజలి’ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. గిరిజా షెత్తర్.. 1969 జూలై 20న జన్మించారు. తెలుగులో అక్కినేని నాగార్జున నటించిన గీతాంజలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ మణిరత్నం ఈ ఇంగ్లాండ్ భామను దక్షిణాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎంట్రీతోనే గీతాంజలి సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకుంది గిరిజా.

గీతాంజలి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు గిరిజా. ఆమె చివరగా.. 2022లో హృదయాంజలి సినిమాతో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చింది. దాదాపు 25ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటించింది. 2003లో చివరిగా హిందీలో తూజే మేరి కసమ్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టులో కనిపించలేదు.

ఇక ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది గిరిజా షెత్తర్. రక్షిత్ శెట్టి సొంత నిర్మాణ సంస్థ పరమవ స్టూడియోస్ నిర్మించిన కన్నడ చిత్రం ‘బ్బని తబ్బిడ ల్లెలి’ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుంది గిరిజా. ఈ చిత్రానికి చంద్రజిత్ బెల్లియప్ప దర్శకత్వం వహించారు. ఇందులో గిరిజా షెత్తర్ సింగిల్ మదర్ మధుమిత పాత్రలో కనిపించనున్నారు. సినిమాలకు దూరమైన గిరిజా.. పెళ్లి తర్వాత బ్రిటన్‍లో జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.