అప్పుడు నా నిర్ణయం కరక్టే అనిపించింది.. అడివి శేష్

| Edited By:

Aug 12, 2019 | 4:28 PM

విలక్షణమైన పాత్రలు చేస్తూ వస్తున్న అడవి శేష్..ఎప్పుడూ విభిన్నమైన కాన్సెప్టు లను ఎన్నుకుంటూ మూవీస్ చేస్తున్నారు. అప్పటి వరకు విలన్ కేరెక్టర్స్ చేసిన శేష్ ‘క్షణం’ సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తనలో ఉన్ననటుడు ఎలా ఉంటాడో అందరికీ తెలిసొచ్చింది. ఇటీవల ఆయన చేసిన ‘ఎవరు’ ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘క్షణం’ తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చిన […]

అప్పుడు  నా నిర్ణయం కరక్టే అనిపించింది.. అడివి శేష్
Follow us on

విలక్షణమైన పాత్రలు చేస్తూ వస్తున్న అడవి శేష్..ఎప్పుడూ విభిన్నమైన కాన్సెప్టు లను ఎన్నుకుంటూ మూవీస్ చేస్తున్నారు. అప్పటి వరకు విలన్ కేరెక్టర్స్ చేసిన శేష్ ‘క్షణం’ సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తనలో ఉన్ననటుడు ఎలా ఉంటాడో అందరికీ తెలిసొచ్చింది. ఇటీవల ఆయన చేసిన ‘ఎవరు’ ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘క్షణం’ తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చిన సంస్థల్లో పెద్ద బ్యానర్లు కూడా వున్నాయి. తాను ఇప్పటివరకు ఓ పది .. పదిహేను సినిమాలు వదులుకున్నానని తెలిపారు. ఇతర హీరోలతో ప్రేక్షకుల ముందుకు వెళ్లాయి .అప్పుడు వదులుకున్న మూవీస్ అన్నీ పరాజయాలు పొందాయి. అవి ఫ్లాప్ అయినందుకు నేను ఆనందపడకపోయినా నా నిర్ణయం కరెక్టేనని అనిపించిందని తెలిపాడు.