Tollywood: షాకింగ్.. రూ. 252 కోట్ల డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ సోదరుడికి సమన్లు.. బాహుబలి బ్యూటీకి కూడా..

ముంబైలో జరిగిన రూ.252 కోట్ల మాదకద్రవ్యాల కేసులో స్టార్ హీరోయిన్ సోదరుడికి యాంటీ-నార్కోటిక్స్ స్క్వాడ్ సమన్లు ​​జారీ చేసింది. మెఫెడ్రోన్ (MD) స్మగ్లింగ్‌కు సంబంధించిన ఈ కేసులో దావూద్ ముఠా ప్రమేయం ఉందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయం సినిమా సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.

Tollywood: షాకింగ్.. రూ. 252 కోట్ల డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ సోదరుడికి సమన్లు.. బాహుబలి బ్యూటీకి కూడా..
Siddhant Kapoor

Updated on: Nov 22, 2025 | 7:10 AM

ముంబైలో రూ.252 కోట్ల మాదకద్రవ్యాల కేసును యాంటీ-నార్కోటిక్స్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు యాంటీ-నార్కోటిక్స్ స్క్వాడ్ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌కు సమన్లు ​​జారీ చేసింది. అలాగే, సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తి అయిన ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓరికి కూడా రెండోసారి సమన్లు ​​జారీ చేశారు. తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి సిద్ధాంత్ కపూర్‌ను మంగళవారం, నవంబర్ 25న పిలిచారు. ఓరిని నవంబర్ 26న హాజరు కావాలని కోరగా. ముంబై పోలీసుల యాంటీ-నార్కోటిక్స్ సెల్‌లోని ఘాట్‌కోపర్ యూనిట్ ఇద్దరినీ విచారణకు పిలిచింది.

అసలు కేస్ ఏంటంటే?
ముంబై పోలీసులు బయటపెట్టిన రూ.252 కోట్ల మాదకద్రవ్యాల కేసు మెఫెడ్రోన్ (MD) అనే మాదకద్రవ్య స్మగ్లర్లకు సంబంధించినది. ఈ కేసు దర్యాప్తు ఆగస్టు 2022 నుంచి కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో 21.82 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ ఉత్పత్తి కేంద్రం సాంగ్లీలోని ఒక ఫ్యాక్టరీలో ఉంది. దీనికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ సలీం మహ్మద్ సుహైల్ షేక్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు. అతని విచారణ కేసును కీలక మలుపు తిప్పింది.

ఇవి కూడా చదవండి

నిందితుడు సలీం షేక్ తన వాంగ్మూలంలో పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖుల పేర్లను వెల్లడించాడు. అందులో, శ్రద్ధా కపూర్, సిద్ధాంత్ కపూర్, నోరా ఫతేహి మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓరితో తదితర ప్రముఖులు దేశంలో, విదేశాలలో డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు అతను పేర్కొన్నాడు. ఇప్పుడీ ఆరోపణలు నిజమా? కాదా? అని ధృవీకరించడానికి ముంబై పోలీసులు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను విచారణ కోసం పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పుడు శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్, ఓరీలను విచారణకు పిలిచింది. ఈ ఇద్దరినీ విచారించిన తర్వాత, ఇతర ప్రముఖులను కూడా విచారణకు పిలవనున్నారు.

ఈ కేసులో పేరు వచ్చిన తర్వాత, నటి నోరా ఫతేహి సోషల్ మీడియాలో తన వైపు నుండి స్పష్టత ఇచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘నేను ఎప్పుడూ అలాంటి పార్టీలకు వెళ్లను. అలాగే, నాకు అలాంటి వ్యక్తులతో సంబంధం లేదు. నేను సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. ఎటువంటి కారణం లేకుండా నా పేరును ఈ కేసుతో ముడిపెడుతున్నారు. నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నా పేరును అలాంటి కేసుల నుండి దూరంగా ఉంచాలి’ అని పేర్కొంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.