ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలం తర్వాత పూర్తిగా మాస్ లుక్లో మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిరు. ఇక ఇప్పుడు ఆయన భోళా శంకర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
భోళా శంకర్ పాటల సందడికి వేళైందని వెల్లడించింది. త్వరలోనే భోళా శంకర్ పాటలు అభిమానుల ముందుకు తీసుకువస్తామని తెలిపింది. భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా వచ్చేస్తోందంటూ ఫ్యాన్స్ కు తియ్యని కబురు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. భోళా శంకర్ నుంచి చిరు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది ఆగస్ట్ 11న అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత ఇప్పటివరకు ఆయన మరో ప్రాజెక్ట్ చేయలేదు. దీంతో ఇప్పుడు మెగాస్టార్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా చిరు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
The wait is over? for the
MEGA MUSIC MANIA of #BholaaShankar ?#BholaaMania Starts Soon ? ??Stay Tuned❤️? @SagarMahati thumping musical ?#BholaaShankarOnAug11thMega? @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @dudlyraj @ramjowrites @Sekharmasteroff @AKentsOfficial pic.twitter.com/gahisr0KDf
— AK Entertainments (@AKentsOfficial) May 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.