
Tollywood Actress
పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల భామ కుర్రాళ్ల కలల రాకూమారి. అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈబ్యూటీ ఒకప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా కెరీర్ తొలినాళ్లలో ట్రోలింగ్ భారీన పడింది. ఇన్నాళ్లు తమిల్ సినీ పరిశ్రమలో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి మంజిమా మోహన్. చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. కోలీవుడ్ స్టార్ గౌతమ్ కార్తీక్ను 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
మొన్నటి వరకు మలయాళంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న మంజిమా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈక్రమంలో తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కొందరు నెటిజన్లు తన శరీరాకృతిపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంజిమా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను బరువు తగ్గితే నాకు ఆఫర్స్ వస్తాయి. కానీ జీవితానికి అదే ముఖ్యం కాదు. హీరోయిన్స్ను బాడీ షేమింగ్ చేసేవారు శరీరం తప్ప ఇంకేమీ కనిపించవా.? సినిమా అనేది నా జీవితంలో ఒక భాగం మాత్రమే.. నాకు ఇంకా ఎన్నో ఆశయాలు ఉన్నాయి. బరువు పెరగడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని మంజిమ తెలిపింది. ఇక ఈ నొప్పిని తట్టుకునే ఓపిక నాకు లేదని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్నా.. ప్రతి ఒక్కరూ హెల్దీగా, ఫిట్గా ఉండాలనే అనుకుంటారు. అయితే కొందరు సహజసిద్ధంగానే లావుగా ఉంటారు. ఈ విషయంలో వారిని ఏ మాత్రం తప్పుపట్టలేం. అందువల్ల దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.