Chandrabose : నేను రాసిన పాటతో వాళ్లు 150 కోట్ల బిజినెస్ చేసుకున్నారు.. ఆ సాంగ్ ఇదే.. చంద్రబోస్ కామెంట్స్..
తెలుగు చలనచిత్ర సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్. సుమారు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు రాసి, తెలుగు పాటను ప్రపంచస్థాయికి (ఆస్కార్) తీసుకెళ్లిన ఘనత ఆయనది. వరంగల్ జిల్లాలోని చల్లగరిగె గ్రామంలో జన్మించిన ఆయన.. తెలుగు సినిమ ప్రపంచంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ తమ జీవితంలోని కీలక ఘట్టాలను, తాను రచించిన ఒక పాట అనుకోని విధంగా సాధించిన అసాధారణ విజయాన్ని వివరించారు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సమావేశానికి అతిథిగా వెళ్ళినప్పుడు, ఆయన తన పాటను ఆలపించానని అన్నారు. అప్పటివరకు ప్రజల్లోకి పెద్దగా వెళ్ళని ఆ పాట, అక్కడి ఏజెంట్లు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాలలో పంచుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని తెలిపారు. ఈ పాట ద్వారా ఆ ఇన్సూరెన్స్ సంస్థ అదనంగా 150 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాధించిందని, ఈ విషయాన్ని స్వయంగా సంస్థ నిర్వాహకులే తమకు తెలిపారని చంద్రబోస్ అన్నారు. ఆ పాట ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
ఆ పాటను పాడి వినిపించారు. “ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే” వంటివి వ్యక్తిగత పట్టుదల, స్వీయ సాధికారత ప్రాముఖ్యతను చాటిచెబుతాయని అన్నారు. ఈ గీతం తన సొంత జీవితానుభవాల నుండి పుట్టిందని తెలిపారు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో సినిమాల్లోకి వచ్చి పాటలు రాయాలని ప్రయత్నించినప్పుడు అనేక అవమానాలను, తిరస్కరణలను ఎదుర్కొన్నానని.. సన్నగా ఉన్న తన రూపాన్ని, చిన్న పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్లే తన విధానాన్ని చూసి చాలా మంది గేలి చేశారని వివరించారు. ఎన్నో తిరస్కరణల తర్వాత, వంద అవమానాల తర్వాత సినిమా రంగం వదిలేద్దాం అని నిర్ణయించుకుని, తాను ఎదుర్కొన్న అవమానాలను లెక్కబెట్టడం ప్రారంభించానని, 21వ అవమానం తర్వాత పరిస్థితి మారి సన్మానాలు, బహుమానాలు లభించడం మొదలైందని వెల్లడించారు. ఈ అనుభవాల స్ఫూర్తితోనే “అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు” అనే తాత్వికతను తన పాటలో పొందుపరిచినట్లు తెలిపారు..
ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..
కవిత్వం పరమ లక్ష్యం కేవలం శ్రోతలను రంజింపజేయడమే కాదని, వారి నడవడికను, ప్రవర్తనను, జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉండటమేనని అన్నారు. అన్నమయ్య తన ఆత్మానందం కోసం వేల కీర్తనలు రాసినట్లుగా, ప్రతి పాటను అదే లక్ష్యంతో రాయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఒక మంచి పాట జనంలోకి వెళ్ళకపోతే అది పాటలో లోపం కాదని, సరైన సమయం (ప్రాప్తం) రానందువల్లే అని అన్నారు. కొన్ని ప్రయత్నాలు ఫలిస్తే, మరికొన్ని ఫలించవని, కానీ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముళ్ళ మార్గాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగాలని తన గీతం ద్వారా స్ఫూర్తినిచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..
ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..
