ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది కేజీఎఫ్ సినిమా. ఈ చిత్రంతో హీరో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతుంది. కేజీఎఫ్-2 కొత్త రిలీజ్ డేట్ను మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా ప్రేక్షకులతో పాటు సిని వర్గాలు సైతం కేజీఎఫ్2పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. అయితే కరోనా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ రావడంతో యశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. రవి బర్సూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
The uncertainties of today will only delay our resolve, but the eventuality is as promised. We will be out in theaters on April 14th 2022. #KGF2onApr14@TheNameIsYash @prashanth_neel @VKiragandur @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @prakashraaj#KGFChapter2 pic.twitter.com/BGMBCatsgA
— Hombale Films (@hombalefilms) August 22, 2021
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే… కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా అదే డేట్న రిలీజ్ చేస్తామని గతంలో సదరు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. మరిప్రశాంత్ నీల్ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయా, లేదంటే సలార్ వాయిదా పడుతుందా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read: “మా” కథ మళ్లీ మొదటికే.. మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవరాల్ కన్క్లూజన్ ఇది
అతడి పొట్టలో రూ.11 కోట్ల విలువైన డ్రగ్స్.. అధికారులు షాక్.. ఫుడ్, వాటర్ వద్దనడంతో