Janhvi Kapoor: ‘ఇప్పటికీ ప్రతిచోట నీకోసం వెతుకుతూనే ఉన్నాను’.. శ్రీదేవిని తలుచుకుంటూ జాన్వీ ఎమోషనల్..

|

Feb 22, 2023 | 6:59 AM

శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేస్తూ.. తల్లితో కలిసి దిగిన అరుదైన ఫోటో నెట్టింట పంచుకుంది.

Janhvi Kapoor: ఇప్పటికీ ప్రతిచోట నీకోసం వెతుకుతూనే ఉన్నాను.. శ్రీదేవిని తలుచుకుంటూ జాన్వీ ఎమోషనల్..
Janhvi Kapoor, Sridevi
Follow us on

భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగింది దివంగత హీరోయిన్ శ్రీదేవి. సౌత్ టూ నార్త్ ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్ చిత్రాల్లో నటించి భారీగా అభిమానులను సంపాదించుకుంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, అమితాబ్ వంటి స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‏తో వివాహం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ రాణించింది. అయితే 2018లో అనుమానస్పద స్థితిలో శ్రీదేవి మృతి చెందడంలో అప్పట్లో షాకింగ్‏కు గురిచేసింది. దుబాయ్ లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొన్న ఆమె..వాష్ రూంలో విగతజీవిగా కనిపించింది. ఆమె మరణించి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు కావొస్తుంది. శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేస్తూ.. తల్లితో కలిసి దిగిన అరుదైన ఫోటో నెట్టింట పంచుకుంది.

“నేను ఇప్పటికీ ప్రతిచోట మీకోసం వెతుకున్నాను అమ్మా.. ఇప్పటికీ నేను చేసే ప్రతి పని నిన్ను గర్వించేలా చేస్తున్నానని ఆశిస్తున్నాను. ఎక్కడికీ వెళ్లినా.. ఏం చేసిన ప్రతి పని నీతోనే మొదలవుతుంది. నీతోనే ముగుస్తుంది. ” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జాన్వీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ ధడక్ సినిమాతో కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. మొదటి చిత్రంతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఆమె.. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్.. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.