యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతోన్న ‘వార్ 2’ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ శరవేగంగా జరుగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాదినే మొదలైంది. ఇప్పటికే స్పెయిన్, అబుదాబిలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ పాల్గొనలేదు. మిగిలిన వారి పై ఈ సన్నివేశాలు షూట్ చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు ‘వార్ 2’ షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు షూటింగ్ సెట్స్ నుంచి లీక్ అయ్యాయి.
రీసెంట్ గా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వార 2’ టీమ్ ఇప్పుడు ముంబై చేరుకుంది. ఇటీవలే తారక్ ముంబై చేరుకున్నారు. ఇందుకు సబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ గా మారాయి. విలే పార్లే స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్ని నిర్మించారు. హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఇదే సెట్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వార్ 2 లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ యాక్షన్ సీన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా 11 మంది స్టంట్ కో-ఆర్డినేటర్లు పని చేస్తున్నారు.. ఈ సినిమాలో కార్ చేజ్, రైలు రేస్ అలాగే హై స్పీడ్ బోట్ రేస్ సీక్వెన్స్లను షూట్ చేయనున్నారు. గతంలో వచ్చిన ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్లతో పాటు నటి కియారా అద్వానీ కూడా నటిస్తుంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పాత్రలో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Hrithik + NTR snapped on the sets of War 2. #HrithikRoshan #War2 pic.twitter.com/MYj0YtSctM
— HrithikRules.com (@HrithikRules) April 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.