AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vedam Movie: అల్లు అర్జున్ ‘వేదం’లో నటించిన ఈ ఫేమస్ డైరెక్టర్‌ను గుర్తు పట్టారా? బాలయ్య, పవన్‌లతో సినిమాలు

కెమెరా వెనక ఉండి 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్' అని చెప్పే డైరెక్టర్లు అప్పుడప్పుడు కెమెరా ముందుకు కూడా వస్తుంటారు. నటనతోనూ మెప్పిస్తుంటారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కూడా పలు సినిమాల్లో నటించాడు. మరి అతనెవరో గుర్తు పట్టారా?

Vedam Movie: అల్లు అర్జున్ 'వేదం'లో నటించిన ఈ ఫేమస్ డైరెక్టర్‌ను గుర్తు పట్టారా? బాలయ్య, పవన్‌లతో సినిమాలు
Vedam Movie
Basha Shek
| Edited By: |

Updated on: Sep 11, 2025 | 11:38 AM

Share

ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో వేదం ఒకటి. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరున్న క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీతో పాటు మంచు మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్ పాయ్, దీక్షా సేథ్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. 2010లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కేబులు రాజు పాత్రలో అల్లు అర్జున్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. అలాగే వేశ్య పాత్రలో అనుష్క నటన కూడా హైలెట్ గా నిలిచింది. బాహబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు కనిపిస్తారు. నాగయ్య, శరణ్య, లేకా వాషింగ్టన్, శియా గౌతమ్, సత్యం రాజేష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, నాగినీడు తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే ఇదే వేదం సినిమాలో ఒక సాధువు తళుక్కున మెరుస్తాడు. ఒక సీన్ లో టెంపుల్ దగ్గర నోట్లో సిగార్ పెట్టుకుని అల్లు అర్జున్ తో ఒక ఫిలాసఫీ కోట్ చెబుతాడు.. ‘తమ్ముడు.. మనుషులు నకిలి నోట్లని తయారు చేస్తారు.. కానీ నోట్లు నకిలి మనుషులనే తయారు చేస్తాయి’ అని చెబుతాడు. దీనికి చిర్రెత్తు కొచ్చిన హీరో.. ‘అన్నై పెరుగు వడలో పెరుగు ఉంటుంది.. కానీ పులి హోరలో పులి ఉండదు.. అది(సిగర్) ఇటీ.. ఒక్కటి పీకితే ఇలాంటివి నాలుగు చెబుతా’ అంటూ స్వామీజికి కౌంటర్ ఇస్తాడు. ఈ డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.

మరి ఈ సీన్ లో బన్నీతో కనిపించినదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడినే.  డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన క్రిష్ వేదం సినిమాలో స్వామిజీ పాత్రలో తళుక్కున మెరిశాడు. అలాగే కీర్తి సురేష్ మహానటి, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో డైరెక్టర్ కే.వీ. రెడ్డి పాత్రలో క్యామియో రోల్ పోషించారు.

ఇవి కూడా చదవండి

ఘాటి సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి..

nbsp;

ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనుల్లో క్రిష్ బిజీగా ఉన్నాడు. అనుష్క ఘాటీ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని గట్టిగా ఉన్నాడు.

భార్యతో ఘాటి డైరెక్టర్ క్రిష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.