Tollywood: ఈ తొర్రి పళ్ల పాప క్రేజీ హీరోయిన్.. ఆ స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..
ఛైల్డ్ చిన్నప్పుడే పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మాయి ఆ తర్వాత పలు సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. అదే సమయంలో ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడింది. పెద్దల అనుమతిలో పెళ్లిపీటలెక్కింది. అయితే గతంలోలా సినిమాలు చేయడం లేదీ అందాల తార.

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ పాప ఎవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఒకప్పుడు సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రూలిద్దరూ సినిమా రంగానికే చెందిన వారు కావడంతో చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాల నటిగా సినిమాలతో పాటు కొన్ని టీవీషోల్లోనూ మెరిసింది. అయితే ఆ తర్వాత చదువు కోసం కాస్త గ్యాప్ తీసుకుంది. బీఎస్సీ పూర్తయిన తర్వాత మళ్లీ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. శింబు, విక్రమ్ ప్రభు, నివిన్ పౌలీ, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లోనూ నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. క్రేజీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒక హ్యాండ్సమ్ హీరోను పెళ్లి చేసుకుందీ అందాల తార. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైందీ ముద్దుగుమ్మ. గత రెండేళ్ల కాలంలో కేవలం ఒకే ఒక వెబ్ సిరీస్ లో కనిపించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోన్న ఈ క్యూటీని కనిపెట్టారా? కష్టంగా ఉందా?అయితే ఆన్సర్ మేమే చెబుదాం లెండి. ఆమె మరెవరో కాదు.. ‘ వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే’ అంటూ కొన్నేళ్ల క్రితం కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ మంజిమా మోహన్.
అక్కినేని నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో లీల పాత్రలో ఎంతో క్యూట్ గా నటించి మెప్పించింది మంజిమ. అలాగే కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో సహాయక నటిగా అలరించింది. ఈ సినిమాల్లో ఆమె నారా భువనేశ్వరి పాత్రను పోషించడం విశేషం. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ నటుడు కార్తీక్ కొడుకు.. హీరో గౌతమ్ కార్తీక్ ను వివాహం చేసుకుంది మంజిమా. వీరిది ప్రేమ వివాహం. ‘దేవరత్తం’ అనే సినిమాలో మంజిమా మోహన్, కార్తీక్ కలసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత ఇరు పెద్దల అనుమతితో 2022లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారీ లవ్ బర్డ్స్.
భర్త కార్తీక్ తో మంజిమా మోహన్..
View this post on Instagram
పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు మంజిమా మోహన్. 2023లో బూ అనే తమిళ్/ తెలుగు సినిమాలో నటించిన ఆమె ఈ మధ్యన ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే నటించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. ఈ మధ్యన బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తోన్నవారిపై తన దైన శైలిలో రెచ్చిపోయిందీ అందాల తార. మరోవైపు భర్త కార్తీక్ పలు సినిమాల్లో నటిస్తున్నాడు. కడలి సినిమాతో తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు కార్తీక్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








