Gopichand: బాలయ్య చెప్పిన పేరుతోనే గోపిచంద్ సినిమా.. ఎదురే లేని టైటిల్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్..

|

Jan 14, 2023 | 4:48 PM

మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.

Gopichand: బాలయ్య చెప్పిన పేరుతోనే గోపిచంద్ సినిమా.. ఎదురే లేని టైటిల్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్..
Gopichand
Follow us on

ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో కలిసి నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు మ్యాచోస్టార్ గోపిచంద్. ఈ షోలో బాలయ్యతో కలిసి తన స్నేహితుడు డార్లింగ్‏ను ఎలా ఆటపట్టించారో చూశాం. వీరిద్దరి మధ్య ఉన్న ఎన్నో రహస్యాలను ప్రేక్షకుల ముందు బయటపెట్టారు ఈ మ్యాచో స్టార్. ఇక ఇప్పుడు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.

ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు,అన్నయ్యగా, కుష్బూ వదిన గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు రామబాణం అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాచో స్టార్ గోపీచంద్ లు పాల్గొన్న సందర్భంలో, అదికూడా వెండితెరపై శ్రీరాముడు పాత్రను సమున్నత రీతిలో అద్వితీయంగా పోషించిన యువరత్న బాలకృష్ణ గారి ద్వారా చిత్రం పేరును ‘‘రామబాణం‘‘ గా ప్రకటించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు చిత్ర దర్శకుడు శ్రీవాస్.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు.‘లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మళ్లీ గోపీచంద్, శ్రీవాస్ లు కలసి పనిచేయటంతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ రెండు సినిమాలను మించేలా ఉండాలని ఈ సినిమా ని శ్రీవాస్ ఓ బాధ్యత తో తీర్చి దిద్దుతున్నాడు. గోపీచంద్ 30 వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా సంస్థ అధినేత లు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల వ్యయానికి వెనకాడకుండా చాలా గ్రాండ్ గా సమున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తూ ఈ చిత్రం విజయంపై నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు చిత్ర నిర్మాతలు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.