
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ జీవితాల గురించి జనాలకు తెలుసు. కానీ టీవీ రంగంలో గ్లామర్ బ్యూటీలుగా గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. సీరియల్స్ ద్వారా అలరించిన పలువురు ముద్దుగుమ్మ.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం రియల్ లైఫ్ లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. ఇప్పటికీ తరగని వయ్యారంతో మెస్మరైజ్ చేస్తుంది. ఆమె పేరు శ్వేతా తివారీ. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి భోజ్పురి నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి పాలక్ తివారీ అనే అమ్మాయి ఉంది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వ్యక్తిగత జీవితం చిక్కుల్లో పడింది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
కసౌతి జిందగీ కి సీరియల్ ద్వారా టీవీ రంగంలో చక్రం తిప్పిన శ్వేతా తివారీ.. ఈ సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 2013లో నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకోవడం ద్వారా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ జంటకు రేయాన్ష్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కానీ మూడేళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. రెండుసార్లు విడాకుల తర్వాత ఒంటరిగా ఉండిపోయింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకును చూసుకుంటూ సీరియల్స్ చేస్తూ జీవితంలో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు అయినప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
శ్వేత తివారీ… 12 సంవత్సరాల వయసులోనే ట్రావెల్ ఏజెన్సీలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె మొదటి జీతం కేవలం ₹500. కానీ నేడు ఆమె ఎపిసోడ్కు రూ.3 లక్షలు తీసుకుంటుంది. ప్రస్తుతం టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఆమె కావడం విశేషం.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..