AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొమాంటిక్ సీన్స్ లేవు.. స్పెషల్ పాటలు లేవు.. అయినా 75 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన ఏకైక సినిమా..

భారీ బడ్జెట్ సినిమా కాదు.. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. అలాగే రొమాంటిక్ సన్నివేశాలు లేవు. అయినా.. ఇటీవల ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. 2026లో విడుదలైన ఈ మూవీ దాదాపు 75 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసింది. థియేటర్లలో రాజ్యమేలి సంచలనం సృష్టించిన ఈ మూవీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ చిత్రాన్ని మీరు చూశారా.. ?

రొమాంటిక్ సీన్స్ లేవు.. స్పెషల్ పాటలు లేవు.. అయినా 75 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన ఏకైక సినిమా..
Thaai Kizhavi Movie Collections
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2026 | 4:12 PM

Share

ప్రస్తుతం ఎక్కువగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు స్టార్ డైరెక్టర్స్. కానీ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు మాత్రమే సంచలనం సృష్టిస్తున్నాయి. కంటెంట్ ఉంటే.. ఎలాంటి గ్లామర్ పాటలు అక్కర్లేదని.. స్టార్ హీరోహీరోయిన్స్ సైతం అక్కర్లేదని నిరూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఒక చిత్రంలో యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు.. స్పెషల్ సాంగ్స్ లేవు. అయినా ఆ మూవీ మాత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. అందులో దాదాపు ఆరు పదుల వయసు ఉన్న హీరోయిన్ నటించింది. 2026లో విడుదలైన ఆ మూవీ దాని బడ్జెట్ కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ సంపాదించింది. ఇంతకీ మనం మాట్లాుకుంటున్న సినిమా ఏంటో మీకు తెలుసా.. ? ఈ చిత్రం థియేటర్లలో అద్భుతంగా 75 రోజులు ప్రదర్శించబడింది. ఈ కథ 70 ఏళ్ల మహిళ అయిన పవనాయుతై (రాధిక శరత్‌కుమార్) చుట్టూ తిరుగుతుంది. ఆమె దురాశపరులైన కొడుకులు ఆస్తిని విభజించి, అంతా తమ పేర్ల మీదకు బదిలీ చేయమని ఆమెపై ఒత్తిడి తేవడంతో కథలో మలుపు వస్తుంది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

కానీ పవనాయుతై తన చివరి శ్వాస వరకు తన సంపద కీర్తిని అనుభవిస్తానని, ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వనని ప్రకటిస్తుంది. ఇంతలో విధి మరో మలుపు తీసుకుంటుంది, పవనాయుతై పక్షవాతానికి గురై నిస్సహాయురాలిగా మిగిలిపోతుంది. తమ తల్లి దుస్థితిని చూసి, ఆమె స్వార్థపరులైన కొడుకులు ఒక ఉద్దేశ్యంతో తిరిగి వస్తారు. తమ తల్లి ఒక నిధిని దాచిపెట్టిందని, దాని రహస్యం పవనుతైకి మాత్రమే తెలుసని వారికి ఒక బలమైన అనుమానం కలుగుతుంది. దానిని పొందడానికి ఈ దురాశపరులైన కొడుకులు ఎంతకైనా తెగిస్తారనేదే ఈ సినిమాలోని మిగిలిన ఆసక్తికరమైన కథ.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘తాయ్ కిజావి’. ఇందులో రాధిక శరత్‌కుమార్ అద్భుతమైన నటనతో పాటు, సింగంపులి, అరుళ్దాస్, బాల శరవణన్, మునిష్కాంత్, ఇళవరసు, జార్జ్ మెరైన్ , వెట్టి ముత్తుకుమార్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కేవలం ₹10 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇంత తక్కువ బడ్జెట్ చిత్రానికి భారీ ఆదరణ లభిస్తుందని, మంచి ఆదాయం వస్తుందని నిర్మాతలు ఆశించారు, కానీ జరిగింది అపూర్వం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 720 శాతం వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹82 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. తన బడ్జెట్‌కు దాదాపు ఎనిమిది రెట్లు వసూలు చేసి, ఈ చిత్రం అనేక ప్రధాన రికార్డులను బద్దలు కొట్టి, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. ఈ తమిళ చిత్రం 75 రోజుల పాటు థియేటర్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 7.5 ఉంది.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

Follow Us