
2008లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘జోధా అక్బర్’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సోను సూద్, నికితిన్ ధీర్ వంటి అనేక మంది కీలకపాత్రలు పోషించారు. ఇది గొప్ప విజువల్స్ , అద్భుతమైన కథ కారణంగా ఆ దశాబ్దపు అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఐశ్వర్య, హృతిక్ రోషన్ మధ్య కెమిస్ట్రీ ప్రశంసలు అందుకుంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ చిత్రంలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ధరించిన దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ 200 కిలోల వరకు నగలు ధరించింది. ఇందులో 20 కిలోల వరకు నిజమైన బంగారం కావడం గమనార్హం.
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
అలాగే ముత్యాలు, కెంపులతో కూడిన ఆభరణాలను 70 మంది కళాకారులు రూపొందించారు. ఆమె చాలా ఆభరణాలు ధరించడంతో, షూటింగ్ సమయంలో ఐశ్వర్య రాయ్ను రక్షించడానికి 50 మంది భద్రతా గార్డులను నియమించారు. ఈ ఆభరణాలను డిజైనర్ నీతా లుల్లా రూపొందించారు. ఈ సినిమా చివర్లో, ఐశ్వర్య రాయ్ డిజైనర్ నీతా లుల్లాతో మాట్లాడి తన వివాహ దుస్తులను డిజైన్ చేయమని కోరింది. డిజైనర్ నీతా లుల్లా ఐశ్వర్య రాయ్ కోసం కాంచీపురం పట్టు దుస్తులను సిద్ధం చేయడం గమనార్హం.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
‘జోధా అక్బర్’ 2008లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిలిచింది. రూ. 45 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ బ్లాక్బస్టర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 73 అవార్డులకు నామినేట్ అయి 38 అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉంది. అలాగే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో అందుబాటులో ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..
Aishwarya Rai Jodha Akbar
ఎక్కువ మంది చదివినవి : Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం