Kantara 2: ఛాతీలోకి 7 బుల్లెట్లు.. పాక్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం.. ‘కాంతార 2’ హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా?
కాంతార ఛాప్టర్ 1 సినిమా రిలీజ్ తర్వాత రుక్మిణీ వసంత్ పేరు మార్మోగిపోతోంది. సినిమాలో ఆమె ఇచ్చే ట్విస్టులు, అందం, అభినయానికి ఆడియన్స్ ముగ్ధులవుతున్నారు. ఈ సినిమాలో హీరో రిషభ్ శెట్టికి పోటీగా రుక్మిణీ నటించిందని క్రిటిక్స్ సైతం కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కన్నడ నాటకు చెందిన రుక్మిణీ వసంత్ సప్తసాగరాలు దాటి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. దీని తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేసిందీ అందాల తార. బఘీరా, బైరతిరంగల్ (కన్నడ), అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఏస్ (తమిళ్), మదరాసి వంటి సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది. అయితే ఈ సినిమాలన్నీ సో సోగానే ఆడాయి. అయితే లేటెస్ట్ గా ఆమె నటించిన కాంతార ఛాప్టర్ 1 మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇందులో రిషభ్ శెట్టి నటన అందరూ ఊహించినదే అయినా రుక్మిణీ పాత్ర మాత్రం సినిమాకు హైలెట్ గా నిలిచిందే. నెగెటివ్ రోల్ లో మెయిన్ విలన్ గా ఆమె అభినయం అందరినీ కట్టిపడేసింది. కాంతార ఛాప్టర్ 1 సినిమా సక్సెస్ తో రుక్మిణీ పేరు మార్మోగిపోతోంది. అయితే రుక్మిణీ వసంత్ ఒక హీరోయిన్గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ, ఆమె దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ జవాన్ కూతురు అని చాలా మందికి తెలియదు.
రుక్మినీ వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పఠాన్కోట్, సిక్కిం, రాంచీ, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఆయన భారత ఆర్మీకి సేవలు అందించారు. అయితే రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన వీరమరణం పొందారు. 2007లో 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో జమ్మూ కశ్మీర్లోని ఉరి ప్రాంతంలోకి ప్రవేశించారు. వారిని గమనించిన కల్నల్ వసంత్ టీమ్ ఉగ్రవాదులతో పోరాడింది. ముఖ్యంగా రుక్మిణీ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రమూకలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోకి సుమారు 7కు పైగా బుల్లెట్లు దిగాయి. కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన ధైర్యసాహాసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అశోక చక్ర పతకంతో కల్నల్ వసంత్ వేణుగోపాల్ ను గౌరవించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పతకం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
అశోక చక్ర పతకం అందుకుంటోన్న రుక్మిణీ వసంత్ తల్లి..

Kantara Chapter 1 Actress Rukmini Vasanth
కాగా తన తండ్రి పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రుక్మిణి కూడా తన పేరును రుక్మిణి వసంత్గా మార్చుకుంది. వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత.., ఆయన భార్య సుభాషిణి వసంత్ “వీర్ రత్న ఫౌండేషన్” అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను అన్నివిధాలుగా అదుకుంటున్నారు. సుమారు 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటు పడుతున్నారు.
రుక్మిణి వసంత్ తండ్రి ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








