Akkineni Nageswara Rao: అక్కినేని చివరి డ్యూయట్ సాంగ్ ఎదో తెలుసా.. ? ఏకంగా ఐదుగురు టాప్ హీరోయిన్స్‌తో స్టెప్పులేసిన ఏఎన్ఆర్

ఆయన ఎంతో మందికి ఆదర్శం. నందమూరి తారకరామారావుతో పోటీగా సినిమాలు  చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తిని నెలకొనేది.

Akkineni Nageswara Rao: అక్కినేని చివరి డ్యూయట్ సాంగ్ ఎదో తెలుసా.. ? ఏకంగా ఐదుగురు టాప్ హీరోయిన్స్‌తో స్టెప్పులేసిన ఏఎన్ఆర్
Akkineni Nageswara Rao

Updated on: Nov 24, 2022 | 5:34 PM

ఇండస్ట్రీలో లెంజెండ్రీ హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఒక తరం హీరోల్లో అక్కినేనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నటన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. నందమూరి తారకరామారావుతో పోటీగా సినిమాలు  చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తిని నెలకొనేది. ఫ్యామిలీ సినిమాలే కాదు.. పౌరాణికం, జానపదం ఇలా ఎన్నో జోనర్లలో సినిమా చేసి అలరించారు ఏఎన్ఆర్. ఆయన చేసినన్ని క్యారెక్టర్లు, ప్రయోగాలు మరెవ్వరికీ సాధ్యం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారు అక్కినేనిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన క్రేజ్. ఇప్పటికీ ఏ ఎన్ ఆర్ సినిమా వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటారు కొందరు.

మాయాబజార్ పేరుతో రెండు సినిమాలు తెరకెక్కయ్యాయి. పాత మాయాబజార్ కాకుండా  1995లో దర్శకరత్న దాసరి నారాయణ మాయాబజార్ పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతోపాటు ఆమనీ, సుమన్ కూడా నటించారు. ఈ సినిమాలో ఒక పాటలో అక్కినేని ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ తో స్టెప్పులేశారు.

ఈ సినిమాలో అవే కళ్లు.. అదే చూపు.. అదే సిగ్గు.. అదే బుగ్గ పాటలో ఏకంగా టాప్ హీరోయిన్లు.. రమ్యకృష్ణ, సౌందర్య, రంభ, రోజా, మాలాశ్రీలతో కలిసి అక్కినేని స్టెప్పులేశారు. అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది. అక్కినేని డ్యూయట్ చేసిన చివరి పాట ఇదేనట. ఈ పాట తర్వాత అక్కినేని మరో డ్యూయట్ సాంగ్ చేయలేదు.

ఇవి కూడా చదవండి