
సినీ సెలబ్రెటీలు చాలా మంది తమ నటనతోనే కాదు మానవత్వంతో, సమాజ సేవతో అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపారు. అలాగే హీరో సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. అలాగే మరికొంతమంది హీరోలు కూడా ప్రజలకు సేవ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఓ హీరో చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. పారిశుద్ధ్య కార్మికురాలికి చెప్పులు తొడిగి మానవత్వం చాటుకున్నాడు ఆ హీరో..ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? పారిశుద్ధ్య కార్మికురాలికి చెప్పులు ఎందుకు తొడిగాడో ఇప్పుడు చూద్దాం.!
ఇటీవలే చెన్నైలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డు శుభ్రం చేస్తుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ లో 45 లక్షల నగదు, 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే ఆమె ఆ బ్యాగ్ ను ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించింది. ఆమె నిజాయితీ గుర్తించి సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి పిలిచి సన్మానించి బంగారు గొలుసు బహుకరించారు. ఆమె పేరు పద్మ. సూపర్ స్టార్ సన్మానించిన తర్వాత పద్మ పేరు మారుమ్రోగిపోయింది.
తాజాగా ఆమెను ఓ కాలేజీ ఈవెంట్ కు ఆహ్వానించారు. ఇదే ఈవెంట్ కు తమిళ్ నటుడు , దర్శకుడు పార్తీబన్ కూడా హాజరయ్యారు. కాగా స్టేజ్ పై పద్మను పార్తీబన్ ఘనంగా సన్మానించారు. అలాగే స్వయంగా ఆమెకు చెప్పులు తొడిగి ఓ చీరను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో పై పార్తీబన్ మాట్లాడుతూ.. బంగారం విలువ పెరిగే కొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఏడాది 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే ఆమెకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని పార్తీబన్ చెప్పుకొచ్చాడు.
தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.
வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP
— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..