
అశుతోష్ రాణా.. తెలుగు సినీరంగంలో మోస్ట్ పాపులర్ విలన్. స్టార్ హీరోల చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ చిత్రంలో డీజీపీ పాత్రలో టెర్రిఫిక్ నటనతో అదరగొట్టేశాడు. పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తూనే తన నటనతో కామెడీని సైతం పండించగల నటుడు అశుతోష్ రామా. తెలుగులో వెంకీ తర్వాత అదే స్థాయిలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా బంగారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో భూమారెడ్డి పాత్రలో అదరగొట్టేశారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ ఈ చిత్రంలో అశుతోష్ రాణా యాక్టింగ్ మరో హైలెట్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే బిజీ నటుడిగా మారిపోయాడు.
తెలుగులో ఒక్కమగాడు, విక్టరీ, బలుపు, తడాఖా, పటాస్ ఇలా వరుస సినిమాలతో అలరించాడు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగుతోపాటు అటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించాడు. అలాగే తమిళం, కన్నడ, మరాఠీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇటు నటుడిగా.. అటు ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అశుతోష్ రాణా కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అశుతోష్ రాణా భార్య సైతం తెలుగులో తోపు హీరోయిన్. అవును.. ఇంతకీ ఎవరు ఆ బ్యూటీ అనుకుంటున్నారా.. ? ఆమె పేరు రేణుక శహానే.
1998లో హిందీలో వచ్చిన తమచా అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. డైరెక్టర్ రాప్ గోపల్ వర్మ తెరకెక్కించిన మనీ సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో జేడీ చక్రవర్తి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఇటు తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ చేసిన ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..