Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

|

Aug 19, 2021 | 4:07 PM

మెగాస్టార్ మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రేయ్ అనే సినిమాతో సాయి ధరమ్ తేజ్ హీరోగా..

Sai Dharam Tej - Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..
Mega Heros
Follow us on

Sai Dharam Tej & Vaishnav Tej: మెగాస్టార్ మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రేయ్ అనే సినిమాతో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా వచ్చింది.. వెళ్ళింది ఎవ్వరికీ తెలియదు. ఆ వెంటనే వచ్చిన పిల్లనువ్వులేని జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు తేజ్. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అయితే చాలా కాలం హిట్స్ కోసం ఎదురుచూశాడు తేజ్. చివరకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రలహరి సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత సినిమా కథల విషయంలో ఆచి తూచి అడుగులువేస్తున్నాడు. రీసెంట్‌గా ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు దేవా కట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో తేజ్ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.

సుకుమార్ శిష్యుడు బిచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు వైష్ణవ్. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు ఈ యంగ్ హీరో. అయితే ఉప్పెన సినిమా కంటే ముందే క్రిష్ సినిమా చేశాడు. కరోనా సమయంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. కేవలం 45 రోజుల్లోనే ఈ సినిమాను పుర్తి చేశాడు దర్శకుడు క్రిష్. కొండపోలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆగస్టు 20న టైటిల్ అలాగే ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయనున్నారు. అయితే సాయి తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ.. వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒక వారం గ్యాప్‌లోనే మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shilpa Shetty: ఇంకా జైల్లోనే భర్త రాజ్ కుంద్రా.. కెమెరా ముందుకొచ్చిన శిల్పా శెట్టి

Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్