Krish -Vaishnav Tej : ఎట్టకేలకు క్రిష్-వైష్ణవ్ తేజ్ మూవీ అప్ డేట్ రానుంది.. ఎప్పుడంటే..

|

Aug 18, 2021 | 5:34 PM

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో హరి హర వీర మల్లు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మీవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Krish -Vaishnav Tej : ఎట్టకేలకు క్రిష్-వైష్ణవ్ తేజ్ మూవీ అప్ డేట్ రానుంది.. ఎప్పుడంటే..
Follow us on

Vaishnav Tej : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో హరి హర వీర మల్లు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మీవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పిరియాడికల్ స్టోరీగా వస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్,  గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొగలాయిలా కాలం నాటి కథ కావడంతో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్లు కూడా వేయించారు క్రిష్. ఇదిలా ఉంటే మెగా హీరో పంజా వైష్ణవ్ తో క్రిష్ ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేశాడు క్రిష్. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. సినిమాకు టైటిల్ కూడా అదే పేరును పరిశీలిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు.

క్రిష్ ప్రస్తుతం పవన్ సినిమా పై దృష్టి పెట్టడంతో  కొండపోలం సినిమా అటకెక్కింది అంతా అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా టైటిల్ తో కూడిన ఫస్టు పోస్టర్ ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. 20వ తేదీన ఉదయం 10:15 నిమిషాలకు ఈ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా కంటే ముందే ఈ సినిమా పూర్తి చేశాడు. కేవలం 45 రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేశారని తెలుస్తుంది.గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ సినిమా చాలా తక్కువ పాత్రలతో ఎమోషన్ తో నడుస్తుందట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

 Sridevi Soda Center: సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘సోడాల శ్రీదేవి సెంటర్’ ట్రైలర్..

Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..

Bigg Boss: ముంబై వీదుల్లో రాఖీ సావంత్‌ రచ్చ.. బిగ్‌బాస్‌‌లో తీసుకోవాలంటూ డిమాండ్..