
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మరోసారి టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారి తీసే వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. త్వరలో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు మరణిస్తారంటూ ఆయన చేసిన ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలు ప్రజలలో, ముఖ్యంగా సినీ అభిమానులలో ఆందోళన అలాగే చర్చకు కారణమయ్యాయి. వేణు స్వామి గతంలో కూడా పలువురు సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని తాను ముందే చెప్పానని ఆయన గతంలో పేర్కొన్నారు. అంతేకాకుండా, మెగాస్టార్ కుమార్తె జాతకం ఆమె బాబాయ్ జాతకాన్ని పోలి ఉంటుందని రకరకాల వ్యాఖ్యలు చేసి చర్చకు దారి తీశారు. ఈ అంచనాలతో పాటు, తాజాగా ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు మరణిస్తారనే ఆయన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే, వేణు స్వామి చేసిన ఈ తాజా వ్యాఖ్యల సంచలనంగా మారాయి. వేణు స్వామి రీసెంట్ డేస్ లో ఏం కామెంట్స్ చేసిన అవి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఓ యంగ్ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడని చెప్పి షాక్ ఇచ్చారు ఆయన. అంతే కాదు ఓ హీరోయిన్ కూడా చనిపోతుంది అని మరో బాంబ్ పేల్చాడు. ఇంతకూ ఆ హీరో, హీరోయిన్ ఎవరు అన్నది చెప్పలేదు కానీ ఇప్పుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ పై పెద్ద చర్చ జరుగుతుంది.
ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కు వేణు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. సినీ సెలబ్రెటీల గురించి, సినిమా వాళ్లకు ఆయన చేసిన పూజల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడని షాక్ ఇచ్చాడు. 40ఏళ్ల లోపే ఆ హీరో ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని అన్నారు వేణు స్వామి. నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఓ హీరోయిన్ కూడా చనిపోతుందని అన్నారు వేణు స్వామి. హీరోయిన్ 2027-28 సంవత్సరాల్లో చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఇద్దరూ ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. మేష, వృశ్చిక రాశులకు చెందిన హీరో, హీరోయిన్ ఇద్దరూ చనిపోతారని చెప్పారు వేణు స్వామి. మరి ఆయన చెప్పింది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇది జనల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి