Captain Miller: స్టార్ హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో యాంకర్‏తో అసభ్య ప్రవర్తన.. ఆకతాయికి దేహశుద్ది..

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే జనవరి 3న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

Captain Miller: స్టార్ హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో యాంకర్‏తో అసభ్య ప్రవర్తన.. ఆకతాయికి దేహశుద్ది..
Anchor Aishwarya Pre Releas

Updated on: Jan 05, 2024 | 8:06 AM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికిల్ యాక్షన్ డ్రామాలో.. ఇదివరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు ధనుష్. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. అలాగే తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే జనవరి 3న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ వేడుకకు భారీ సంఖ్యలో ధనుష్ ఫ్యాన్స్ హజరయ్యాడు. అదే సమయంలో హోస్టింగ్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యను ఓ ఆకతాయి అసభ్యంగా తాకాడు. పదే పదే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడి తీరుతో విసిగిపోయిన యాంకర్..వెంటనే అతడికి దేహశుద్ధి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఐశ్వర్యకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై యాంకర్ ఐశ్వర్య స్పందించింది. కెప్టెన్ మిల్లర్ ప్రీ రిలీజ్ వేడుకలో ఓ వ్యక్తి తనను వేధించాడని.. వెంటనే అతడి ప్రవర్తనకు ఎదురుతిరిగానని తెలిపింది. ఆ తర్వాత అతడు పరిగెత్తడానికి ప్రయత్నించాడని.. అయిన అతడిని వదలకుండా పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. తన చుట్టూ ఎంతో మంది మంచి వ్యక్తులు ఉన్నారని.. ఈ ప్రపంచంలో చాలా మంది గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారని తాను నమ్ముతున్నానని.. అయినా కొద్దిమంది రాక్షసులు ఉండడంతో ఇంకా భయపడుతూ ఉండాల్సి వస్తుందంటూ రాసుకొచ్చింది.

Anchor Aishwarya

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ నుని కెమెరా క్రాంక్ చేయగా, నాగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ మూడు భాగాల ఫ్రాంచైజీగా సెట్ చేయబడిందని, ఇది సినిమా మొదటి భాగం అని పేర్కొన్నారు డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.