Mahesh Babu: మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసిన నిర్మాత.. కానీ ఇంతలో..

|

Aug 04, 2024 | 10:50 AM

మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. మహేష్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఎయిర్ పోర్ట్, అనంత్ అంబానీ పెళ్ళిలో మహేష్ లుక్ వైరల్ గా మారింది. అలాగే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Mahesh Babu: మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసిన నిర్మాత.. కానీ ఇంతలో..
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. మహేష్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఎయిర్ పోర్ట్, అనంత్ అంబానీ పెళ్ళిలో మహేష్ లుక్ వైరల్ గా మారింది. అలాగే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్నీ తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ ను దాటి గ్లోబల్ రేంజ్ లోకి తీసుకెళ్లనున్నారు.

ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషన్స్ పని చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు గోల్డ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ స్టార్ ప్రొడ్యూసర్ మహేష్ బాబుతో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్నారట.. కానీ కుదరలేదు ఆయన ఎవరో కాదు ..

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు అల్లు అరవింద్. ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్నీ మరో నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఇటీవలే బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. అరవింద్ గారు ముంబై మేకర్స్ కలిసి మహేష్ బాబు గారు హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కథ అన్ని ఓకే అయ్యాయి.. కానీ  ముంబై మేకర్స్ కోలబ్రేషన్ తో తేడా వచ్చి అది ఆగిపోయింది. ఇప్పుడు అది హిందీ వాళ్లు వేరే వాళ్ళను పెట్టి మొదలు పెట్టేశారనుకుంటా అని అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే మహేష్ బాబుతో రామాయణం సినిమాను చేయాలనీ అరవింద్ అనుకున్నారు. కానీ ఇప్పుడు హిందీ వాళ్ళు ఆ సినిమాను రణబీర్ కపూర్ తో చేస్తున్నారు. ఇలా అల్లు అరవింద్ మహేష్ బాబు కాంబినేషన్ మిస్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.