Aishwarya Rajesh: నమ్మిన వ్యక్తే నన్ను మోసం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్

వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ఆకట్టుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Aishwarya Rajesh: నమ్మిన వ్యక్తే నన్ను మోసం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్
Aishwarya Rajesh

Updated on: Jul 06, 2021 | 9:09 PM

Aishwarya Rajesh: వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ఆకట్టుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాలతో ఫెమస్ అయ్యింది. ఆతర్వాత కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో తన నటనతో శబాష్ అనిపించుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు తాను ఎంతో నమ్మిన వ్యక్తే తనను మోసం చేసాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చాలా నమ్మకం అతడిపై పెట్టుకుంటే డబ్బు కోసం నన్ను వంచించడం మొదలు పెట్టాడు. బయటి వారికి డబ్బులకు నా సమాచారం అమ్ముకుంటూ నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చింది. తనకు సంబంధించిన విషయాలను లీక్ చేశాడని… ఆ విషయాన్ని తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానని చెప్పింది. తన వెంటే ఉంటూ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసాడని తెలిపింది.

నా వ్యక్తిగత విషయాలను బయటకు నా వెంట ఉన్న వ్యక్తే చేరవేస్తున్నాడు అనే విషయం తెలిసి షాక్ అయ్యాను. వెంటనే అతడిపై పోలీసు కేసు పెట్టాలంటూ చాలా మంది నాకు సూచించారు. కాని నేను అపని చేయాలనుకోవడం లేదు. ఇకపై తానే జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఐశ్వర్య తెలిపింది. ఇలాంటి వ్యక్తులు కొందరు చేసే పనుల వల్ల ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.  ఇలాంటి నమ్మకద్రోహంకు మళ్లీ గురి కాకుండా ఇతరులను మళ్లీ నమ్మవద్దని అనుకుంటున్నాను. ఇతరులు మోసం చేయకుండా ఉండాలంటే మనమే జాగ్రత్తగా ఉండాలిని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actress Saranya: ఘనంగా జరిగిన నటి శరణ్య పెద్దకూతురు ప్రియదర్శిని రిసెప్షన్ వేడుక .. హాజరైన సీఎం స్టాలిన్ దంపతులు

Taapsee Pannu: తెలుగులో చాలా కాలం తర్వాత తిరిగి సినిమా చేస్తున్న బ్యూటీ..

Renu-Adivi Seshu: పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య చేసిన ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ అడవి శేషు ఆసక్తికరమైన కోరిక