Trisha Krishnan: మణిరత్నం సినిమా తర్వాత స్పీడ్ పెంచిన త్రిష.. ఏకంగా ఆ ముగ్గురు హీరోలతో..

|

May 31, 2023 | 9:01 AM

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Trisha Krishnan: మణిరత్నం సినిమా తర్వాత స్పీడ్ పెంచిన త్రిష.. ఏకంగా ఆ ముగ్గురు హీరోలతో..
Trisha
Follow us on

వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్‏గా కొనసాగుతుంది. గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న త్రిష 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా త్రిష మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించింది. ఈ సినిమా త్రిషకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పుకొవాలి.

ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష అందానికి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు. నాలుగు పదుల వయసులోనూ ఇరవైఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అభిమానులను మంత్రముగ్దులను చేసింది. ఈ క్రమంలోనే త్రిష ముగ్గురు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దళపతి విజయ్ లియో సినిమా గురించే. త్రిష, విజయ్ జోడీగాకి తమిళ నట మంది క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అజిత్‌ నూతన చిత్రం విడా ముయర్చి లోనూ త్రిష నటిస్తోంది. ఈ ఇద్దరు కూడా గతంలో కలిసి సినిమాలు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌  నటిస్తోన్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. వీటితో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది త్రిష.