
కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో విక్రమ్ చియాన్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా నిత్యం విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన సినిమా, పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయిన చేసేందుకు ముందుంటారు. అలాగే ఎప్పుడూ తన సినిమాల్లో కొత్తగా కనిపించేందుకు ముందుంటారు. ఇటీవల తంగలాన్, వీర ధీర సూరన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు విక్రమ్. ఇక ఇప్పుడు తన 63వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. మండేలా, మావీరన్ వంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మడోనా అశ్విన్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో విక్రమ్ చియాన్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శాంతి పిక్చర్స్ బ్యానర్ పై రానున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గా్ల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన ఏ హీరోయిన్ నటించనున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇందులో ప్రియాంక మోహన్, శ్రీనిధి శెట్టి నటించనున్నారనే టాక్ వినిపించింది. ఇక తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. కొన్నాళ్లుగా తెలుగులో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది ఈ హీరోయిన్.
లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు విక్రమ్ చియాన్ సరసన నటించనున్నట్లు సమాచారం. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటివరకు వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న మీనాక్షి చౌదరి.. ఇప్పుడు తమిళంలో విక్రమ్ చియాన్ మూవీతో జోడి కట్టనుంది. దీంతో వీరిద్దరి కాంబోలో మరింత క్యూరియాసిటీ నెలకొంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..