పైకి కొంచెం కఠినంగా కనిపించినా నందమూరి బాలకృష్ణ మనసు వెన్నలాంటిది. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లలో ఎవరని అడిగినా ఇదే విషయం చెబుతారు. చాలా సందర్భాల్లో ఆయన అభిమానులపై చేయి చేసుకుని విమర్శల పాలై ఉండచ్చు. కానీ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మాత్రం బాలయ్య ఎప్పుడూ ముందుంటారు. అలా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి నట సింహం. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జి్లా కడియపులంకలో పూలకుండీల షాపులో రాజ్కుమార్ పాండే మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ పాప ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో పాప పరిస్థితిని తండ్రి రాజ్కుమార్ జనసేన పార్టీ నేత రత్నం అయ్యప్ప దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్కు వివరించారు. ఆయన కూడా వెంటనే స్పందించి ఫోన్ ద్వారా బాలయ్యకు పాప పరిస్థితిని వివరించారు. చిన్నారి వైద్యానికి సాయం చేయాలని కోరారు. అలాగే పాపకు అందించాల్సిన వైద్య వివరాలను కూడా బాలయ్యకు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన బాలకృష్ణ సదరు చిన్నారిని హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు.
ఆ తర్వాత పాపకు కావాల్సిన పూర్తి వైద్య సదుపాయాల్ని అందించాలని బసవ తారకం ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు బాలయ్య. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాలకృష్ణ స్వయంగా వచ్చి కూతురు వైద్యచికిత్సకు ఆదేశించడం ఎప్పటికీ మరిచిపోలేనని తండ్రి రాజ్కుమార్ పాండే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. NBK 109 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
చిన్నారుల మధ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న బాలయ్య❤️
చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి చిన్నారుల మధ్య స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వతంత్ర భారతమని కొనియాడారు.#NandamuriBalakrishna #BasavatrakamHospital pic.twitter.com/14GhcPcOlx
— Rakhi_NBK_Official 🔰 (@RakhiNbk) August 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.