AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sneha Reddy: ఫాలోవర్లతో ముచ్చటించిన అల్లు అర్జున్ సతీమణి.. గ్యాలరీలో ఇష్టమైన ఫోటో అదేనట..

ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికా ట్రిప్‏కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనయుడు.. కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తోన్న

Allu Sneha Reddy: ఫాలోవర్లతో ముచ్చటించిన అల్లు అర్జున్ సతీమణి.. గ్యాలరీలో ఇష్టమైన ఫోటో అదేనట..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2022 | 8:19 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవలే పుష్ప మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు నార్త్, సౌత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా.. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‏గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. త్వరలోనే పుష్ప 2 సైతం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం బన్నీ తన కుటుంబంతో కలిసి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికా ట్రిప్‏కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనయుడు.. కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తోన్న మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. ఇక అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

స్నేహా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ విషయాలే కాకుండా.. కూతురు అర్హ, తనయుడు అయాన్ ఫోటోస్, గేమ్స్ ఆడుకుంటున్న వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. స్నేహకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. ఎప్పుడూ ఫోటోస్, వీడియోస్ షేర్ చేసే స్నేహా..తాజాగా ఫాలోవర్లతో ముచ్చటించింది.

Allu Arjun Family

Allu Arjun Family

క్రమంలోనే ఓ అభిమాని.. మీకు మీ గ్యాలరీలో అత్యంత ఇష్టమైన ఫోటో ఏది అనిగా.. తన భర్త, కూతురు, కొడుకుతో కలిసి ఉన్న ఫ్యామిలీ పిక్ షేర్ చేసింది. ఇటీవల ఆఫ్రికా ట్రిప్ లో దిగిన ఫోటో తన ఫేవరేట్ అని చెప్పింది. తాము ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నామని.. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. స్నేహ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.