రణ్‌వీర్ మూవీపై బడా నిర్మాతల కన్ను..?

| Edited By:

Feb 18, 2019 | 12:22 PM

రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘గల్లీ బాయ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇండియన్ ర్యాపర్స్ డివైన్, నేజీ జీవిత అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై విమర్శకులకే కాదు హాలీవుడ్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై టాలీవుడ్ నిర్మాతల కన్ను పడ్డట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఐదారు మంది పేరు మోసిన నిర్మాతలు ‘గల్లీ బాయ్’ రీమేక్ రైట్స్ కోసం సంప్రదింపులు […]

రణ్‌వీర్ మూవీపై బడా నిర్మాతల కన్ను..?
Follow us on

రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘గల్లీ బాయ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇండియన్ ర్యాపర్స్ డివైన్, నేజీ జీవిత అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై విమర్శకులకే కాదు హాలీవుడ్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై టాలీవుడ్ నిర్మాతల కన్ను పడ్డట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపుగా ఐదారు మంది పేరు మోసిన నిర్మాతలు ‘గల్లీ బాయ్’ రీమేక్ రైట్స్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. వారిలో బడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరందరిలో ‘గల్లీ బాయ్’ ఎవరిని వరిస్తాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జోయా అక్తర్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.