మళయాళంలో ‘సామజవరగమనా’.. సాంగ్ విన్నారా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో.. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను ఈ చిత్ర బృందం రిలీజ్ చేశారు. అందులో ఒకటి ‘నీ కాళ్లను పట్టుకు వదలనందే’. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ.. ప్రస్తుతం ఎవరు చూసినా.. ఈ పాటను తెగ పాడేస్తున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. ఈ పాట ఎక్కువ మంది […]

మళయాళంలో సామజవరగమనా.. సాంగ్ విన్నారా..?

Edited By:

Updated on: Nov 10, 2019 | 2:10 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో.. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను ఈ చిత్ర బృందం రిలీజ్ చేశారు. అందులో ఒకటి ‘నీ కాళ్లను పట్టుకు వదలనందే’. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ.. ప్రస్తుతం ఎవరు చూసినా.. ఈ పాటను తెగ పాడేస్తున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. ఈ పాట ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాటను తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు.

అయితే.. ఈ సినిమాను మళయాలంలో కూడా రిలీజ్ చేయాలనుకుంటోంది ఈ చిత్ర యూనిట్. ‘అంగు వైకుంఠపురత్తు’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. అక్కడ కూడా ‘సామజవరగమన’ సాంగ్ వర్షన్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ప్రముఖ సింగర్ ఏసుదాస్ కుమారుడు విజయ్ ఏసుదాస్ పాడగా.. బీకే హరినారాయనన్ రాశారు. ప్రస్తుతం అక్కడ కూడా ఈ పాట సాంగ్ దుమ్ము లేపుతోంది.